టాలీవుడ్ సినిమా పరిశ్రమకు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిననటి కియారా అద్వానీ, అంతకముందు బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ హీరోగా తెరకెక్కిన ఎమ్ ఎస్ ధోని అనే సినిమాలో దిశా పటాని తో పాటు మరొక హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీ, తన అందం, ఆకట్టుకునే నటనతో మంచిపేరు దక్కించుకుంది. అయితే ఆ సినిమాలోని నటనకు గాను అక్కడి నుండి ఆమెకు బాలీవుడ్ లో కూడా పలు అవకాశాలు లభించాయి. 

 

ఇక అదే సమయంలో ఆ సినిమా చూసిన దర్శకుడు కొరటాల శివ, తాను సూపర్ స్టార్ మహేష్ తో తీయబోయే భరత్ అనే నేనులో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేయడం జరిగింది. ఇక అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టి సౌత్ లో కియారాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇకపోతే ఆ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమాలో హీరోయిన్ గా నటించిన కియారకు, ఆ సినిమా ఘోర మైన ఫ్లాప్ ని అందుకోవడంతో చేదు అనుభవాన్ని మిగిల్చింది. 

 

నిజానికి ఆ తరువాత బాలీవుడ్ లో ఆమెకు మంచి అవకాశాలు వచ్చినప్పటికీ తెలుగులో మాత్రం ఇప్పటివరకు మరొక ఛాన్స్ లేదు. అయితే అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి ల కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా కియారను ఎంపిక చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో కొద్దిరోజుల నుండి వార్తలు వస్తున్నాయి. మరి తొలి సినిమాతో ఆమెకు అవకాశం ఇవ్వడంతో పాటు, సూపర్ సక్సెస్ ఇచ్చిన మహేష్ బాబు, మళ్ళి ఆమెతో అతి త్వరలో చేయబోయే సినిమాతో మరొక సక్సెస్ ఇచ్చి, తెలుగులో ఆమె కెరీర్ కి మంచి బాటలు వేస్తారని మహేష్ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి అది ఎంతవరకు జరుగుతుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: