వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేస్తూ వారంరోజులు ముందుగానే జనవరి 8న ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల కాబోతోంది అని వచ్చిన ప్రకటన పవన్ కళ్యాణ్ క్రిష్ లకు షాక్ ఇస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ ‘పింక్’ రీమేక్ మూవీలో నటిస్తూనే క్రిష్ దర్శకత్వంలో ఒక భారీ పీరియాడిక్ మూవీని అప్పుడే మొదలు పెట్టేసాడు. సుమారు 100 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ఈమూవీ తెలంగాణ ప్రాంతంలో రాబిన్ హుడ్ గా పేరు గాంచిన పండుగల సాయన్న జీవితం ఆధారంగా తీయబడుతోంది. 


ఈమూవీలో రెండు కోట్ల పారితోషికం ఇచ్చి కియారా అద్వానీని హీరోయిన్ గా ఒప్పించడంతో పాటు ఈమూవీకి భారీ టెక్నికల్ టీమ్ తో పాటు భారీ తారాగణంతో తీస్తున్నారు. వాస్తవానికి ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్న క్రిష్ కు ప్రస్తుతం మార్కెట్ లో అంతగా క్రేజ్ లేకపోయినా ఈమూవీలో హీరోగా నటిస్తున్న పవన్ పై 100 కోట్ల బడ్జెట్ రిస్క్ అని తెలిసినా ఈమూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసి తెలివిగా మార్కెట్ చేయాలని ఈమూవీని నిర్మిస్తున్న ఏ ఎమ్ రత్నం ప్లాన్. 


దానికితోడు ఈమూవీలో భారీ విజువల్ ఎఫెట్స్ గ్రాఫిక్స్ ఉండటంతో ఈమూవీ బడ్జెట్ 100 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ వచ్చే ఏడాది సంక్రాంతికి రావడం ఖాయం అవ్వడంతో సంక్రాంతి సీజన్ కు రెండు భారీ సినిమాలు విడుదల అవ్వడం సాంప్రదాయం కాబట్టి ఆపద్ధతి ప్రకారం ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలైన వారం రోజుల గ్యాప్ తో జనవరి 14న పవన్ క్రిష్ ల మూవీని విడుదల చేస్తారా లేదంటే ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియా ముందు పవన్ సినిమా నిలబడలేదు అని భావించి వచ్చేఏడాది సమ్మర్ సీజన్ కు వెళ్ళిపోతుందా అంటూ ఊహాగానాలు మొదలైపోయాయి. 


ఒకవేళ చాలవేగంగా ఈసినిమాను పూర్తిచేసి ఈఏడాది దసరాకు రావాలని భావించినా ఆసీజన్ ను టార్గెట్ చేస్తూ చిరంజీవి కొరటాల మూవీ రాబోతోంది. దీనితో పవన్ క్రిష్ ల భారీ మూవీ మెగా కుటుంబానికే చెందిన చిరంజీవి చరణ్ ల సినిమాల మధ్య నలిగిపోతుంది అంటూ అప్పుడే లేటెస్ట్ గా మొదలైన ఈమూవీ  గురించి పవన్ పై చాలమంది సానుభూతి చూపెడుతున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: