‘సరిలేరు నీకెవ్వరు’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినా ఆ మూవీ వంద కోట్ల సినిమాగా మారింది అంటే అది కేవలం మహేష్ స్టామినా వలన మాత్రమే సాధ్యమైంది అన్నది ఓపెన్ సీక్రెట్. ప్రస్తుతం తన అభిమానులకు దూరంగా అమెరికాలో తన ఆరోగ్య కారణాల రీత్యా ఉంటున్న మహేష్ పై నిన్న వచ్చిన ఒక షాకింగ్ న్యూస్ కొన్ని గంటలలోనే మహేష్ అభిమానుల మధ్య వైరల్ గా మారిపోయింది. 


ప్రచారంలోకి వచ్చిన వార్తల ప్రకారం అనీల్ రావిపూడి దిల్ రాజ్ కాంబినేషన్ లో త్వరలో ప్రారంభంకాబోతున్న ‘ఎఫ్ 3’ మూవీకి ఒక ప్రత్యేక పాత్రలో నటించమని దిల్ రాజ్ ద్వారా ఒత్తిడి చేయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ‘ఎఫ్ 3’ మూవీలో నటించడానికి వెంకటేష్ వరుణ్ తేజ్ లు అంగీకారం తెలిపారు అని వార్తలు వస్తున్నాయి. 


అయితే ఈ మూవీ కథ రీత్యా మూడవ హీరోగా మరొక టాప్ హీరో నటిస్తే ఆ మూవీకి మరింత మంచి క్రేజ్ వస్తుందని అనీల్ రావిపూడి ఆలోచన. ఈ మూవీ కథ రీత్యా సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ మూడవ హీరో పాత్ర సుమారు 30 నిముషాలు మాత్రమే ఉంటుందని అని అంటున్నారు. దీనితో ఈ పాత్రను మహేష్ చేత నటింప చేస్తే ఈ మూవీ మార్కెట్ కు ఆకాశమే హద్దు అవుతుంది కాబట్టి ఈ చిన్న అతిథి పాత్రను చేస్తే చాలు ఎంత పారితోషికం అయినా ఇవ్వడానికి రెడీ అంటూ దిల్ రాజ్ నమ్రత ద్వారా మహేష్ కోసం రాయబారాలు చేస్తున్నట్లు టాక్. 


అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ మూవీని జూన్ లో మొదలుపెట్టి వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ కు విడుదల చేయాలని దిల్ రాజ్ ప్లాన్ అని అంటున్నారు. ఇప్పుడు ఈ వార్తలు ఇలా లీక్ అవ్వడంతో అటువంటి పొరపాట్లు చేయవద్దు అంటూ అప్పుడే మహేష్ అభిమానులు కలవర పడుతూ అమెరికాలో ఉన్న మహేష్ కు సందేశాలు పంపుతున్నట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: