టాలీవుడ్ లోకి నాగశౌర్య నటించిన ‘ఛలో’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కన్నడ బ్యూటీ రష్మిక మందన.  ఏ ముహూర్తంలో తెలుగు లో అడుగు పెట్టిందోకానీ ఈ బ్యూటీ పట్టిందల్లా బంగారం అవుతుంది.  ఆ తర్వాత పరుశరామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘గీతాగోవిందం’ మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.  దాంతో అందరి దృష్టి ఈ కన్నడబ్యూటీపై పడింది.  ఆ తర్వాత దేవదాస్, డీయర్ కామ్రెడ్ లో నటించింది.  ఈ ఏడాది అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో బాక్సాఫీస్ విజయం అందుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడమే కాదు రెండ వందల కోట్ల క్లబ్ లో చేరింది. ప్రస్తుతం రష్మిక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ చిత్రంలో నటిస్తోంది. 

 

 రష్మిక తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో వరుస ఛాన్సులు వచ్చేస్తున్నాయి.   మొత్తానికి  గ్లామర్, క్యూట్ లుక్స్ తో ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల ని ఫిదా చేసిన రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ బడా హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.  ఇదిలా ఉండగా రష్మిక ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో మెరిసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టైలిష్ డ్రెస్ లో రష్మిక విమానాశ్రయంలో కనిపించింది.  సాధారణంగా సెలబ్రెటీలు విమానాశ్రయంలో కనిపిస్తే.. వెంటనే సెల్ఫీలకు ఎగబడతారు ఫ్యాన్స్.   స్టైలిష్ డ్రెస్ లో రష్మిక విమానాశ్రయంలో కనిపించింది.

 

 కానీ ఆమె ఎవరికీ సెల్ఫీ ఇచ్చే పరిస్థితిలో లేదు.. కారణం అప్పటికే ఎయిర్ పోర్ట్ కి ఆలస్యంగా రావడం.. కంగారు గా ఉండటంతో పరుగులు పెట్టింది. ఆ  సమయంలో కొందరు రష్మిక ఫోటోలు తీయడానికి ప్రయత్నించారు. వారితో ఫన్నీ కామెంట్స్ చేస్తూ రష్మిక వెళ్ళింది. నేను అసలే ఆలస్యంగా వచ్చాను.. మీరేమో ఫోటోలు తీస్తున్నారు అని కామెంట్స్ చేస్తూ నవ్వుకుంటూ విమానం కోసం పరిగెత్తింది. దాంతో కొంత మంది క్యూట్ డ్రెస్ లో పరుగులు పెడుతున్న రష్మిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#rashmikamandanna 😆😆 fun 📸 @kamleshnand #instalove @rashmika_mandanna #rashmikamandannafans #tollywoodcelebs #southactress

A post shared by kamlesh Nand (work ) (@artistrybuzz) on

మరింత సమాచారం తెలుసుకోండి: