సమంత అక్కినేని, శర్వానంద్ జంటగా నటించిన సినిమా `జాను`. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, అందాల తార త్రిష జంటగా నటించిన 96 చిత్రం తమిళంలో అద్భుతమైన విజయాన్ని అందుకొని ప్రేక్ష‌కుల మ‌న‌సులో చెర‌గ‌రాని ముద్ర వేసింది. ఈ సినిమాకు రీమేక్‌గా వ‌చ్చేందే జాను. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించగా ప్రేమ్ కుమార్ తెరకెక్కించాడు. టీజర్లు, ట్రైలర్లు యూత్‌ను విశేషంగా ఆకట్టుకొన్నాయి. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 

ఇటీవ‌ల జాను టీజర్ అండ్ ట్రైలర్ కి కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ముందు నుంచే సినిమాపై అంచనాలైతే గట్టిగా పెరిగాయి. మనసును తాకే సన్నివేశాలకు తోడు అందమైన సంగీతం 96 సినిమాకు ప్రత్యేకత. ఇక ఇప్పటికే యూఎస్ లో సినిమా ప్రీమియర్స్ ని ప్రదర్శించారు.   ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే శర్వానంద్, సమంత హిట్ కొట్టినట్లే కనిపిస్తున్నారు. సినిమా స్లోగా ఉన్నా కూడా కచ్చితంగా మనసును దోచేలా ఉందంటున్నారు ఆడియన్స్. శర్వా, సమంత కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. తమిళనాట విజయ్ సేతుపతి, త్రిష కెమిస్ట్రీ సినిమాకు ప్రాణం పోసిన సంగ‌తి తెలిసిందే.

 

ఇదే సీన్ తెలుగులో కూడా రిపీట్ అవుతుందని ధీమాగా చెబుతున్నారు అభిమానులు. శర్వానంద్, సమంత మధ్యే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయని తెలుస్తుంది. ఇక్కడ కూడా అదే మ్యాజిక్ ఉండేలా చూసుకుంటున్నాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. శర్వానంద్, సమంత కెమిస్ట్రీ కూడా బాగానే ఉంది. నా కోసం.. తన జాను కోసం నా రామ్ వచ్చేసాడు అంటూ సమంత చెప్పిన డైలాగ్ అదిరిపోయింద‌ని చెప్పాలి. ఓవర్సీస్ టాక్ అయితే బాగుంది.. మరి ఇక్కడ ఇంత స్లో సినిమా ఎక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: