టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన వన్ నేనొక్కడినే అనే సినిమాలో నటించిన బాలీవుడ్ భామ కృతి సనన్, ఆ సినిమా తరువాత నాగ చైతన్య సరసన దోచేయ్ అనే సినిమాలో కూడా నటించింది. అయితే అనూహ్యంగా ఆ రెండు సినిమాలు ఆమెకు పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. ఇక అక్కడి నుండి ఎక్కువగా బాలీవుడ్ పైనే దృష్టి పెట్టిన కృతి, మెల్లగా అక్కడ ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకోసాగింది. ఇక ఇటీవల వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న కృతి, అప్పట్లో యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో చట్టాపట్టాలేసుకుని తిరిగింది. 

 

ఇక అప్పట్లో వారిద్దరి మధ్య రహస్య ప్రేమాయణం సాగుతోందని, అలానే వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారని బాలీవుడ్ లో కథనాలు ప్రచారం అయ్యాయి. అయితే సడన్ గా ఏమయిందో ఏమో తెలియదు గాని, సుశాంత్ నుండి విడిపోయిన కృతి, ఇటీవల మరొక యువ నటుడు కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఎక్కువగా కనపడుతోంది. కొన్నాళ్లుగా పలు పబ్బులు, రెస్టారెంట్ల లో కలిసి దర్శనం ఇస్తున్న ఈ జంట పీకల్లోతు ప్రేమలో ఉందని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. మరోవైపు ఈ ఇద్దరి ప్రేమ విషయం వారి సన్నిహిత వర్గాల వారికి తెలుసునని, ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట అతి త్వరలో పెళ్లి చేసుకున్నా చేసుకోవచ్చని కూడా సమాచారం. 

 

ఇకపోతే నేడు ముంబై విమానాశ్రయం వద్ద మీడియా కంట పడిన కృతి, ఎంతో చిరునవ్వులు చిందిస్తూ కనపడింది. అయితే ఆ సమయంలో ఆమె వేసుకున్న బ్లూ కలర్ డ్రెస్ పరిశీలిస్తే, బాటమ్ లో లవ్ సింబల్స్ లో కట్ చేయబడిన ఉన్న ఆ డ్రెస్ ని బట్టి చూస్తే అమ్మడు లవ్ లో పడి ఎంతో ఆనందంగా ఉందన్నదానికి ప్రూఫ్ ఆమె వేసుకున్న డ్రెస్ అని అంటున్నారు కొందరు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మాత్రం, మరికొద్దిరోజలు వెయిట్ చేయాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: