టాలీవుడ్ లో maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయిన నటి సమంత తర్వాత తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోల సరసన నటించింది.  సమంత అందం, అభినయంతో పాటు ఎలాంటి పాత్రల్లో అయినా ఇట్టే ఒదిగిపోతుంది.  ఏం మాయ చేసావే మూవీ లో నటించిన సహ నటుడు అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంట maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే, ఆటో నగర్ సూర్య, మనం తర్వాత గత ఏడాది మజిలీ సినిమాలో నటించారు.  వాస్తవానికి సమంత వివాహం తర్వాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పబోతుందా అన్న అనుమానాలు వచ్చాయి.  కానీ ఈ అమ్మడు పెళ్లైన తర్వాతనే ఎక్కువ సినిమాల్లో నటిస్తూ మంచి విజయాలు అందుకుంటుంది. ఈ రోజు సమంత, శర్వానంద్ నటించిన జానూ మూవీ రిలీజ్ అయ్యింది.

 

 ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మరో మూడేళ్ల తర్వాత సినిమాల్లో నటించకపోవచ్చన్నారు.  తాను మూడేళ్ల తర్వాత తెరపై కనిపించక పోవొచ్చు అన్నారు.  అయితే ఎందుకు అన్న విషయం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.. బహుషా సమంత తల్లి కావాలని నిర్ణయించుకుని ఉంటుందని భావిస్తున్నారు.  అయితే సమంతకు ఇప్పటి వరకు ఒక కోరిక మాత్రం తీరలేదట. ఇప్పటి వరకు అన్ని సినిమాలలోను తనను మంచి అమ్మాయి గా చూపెట్టారు. తనకి మాత్రం భయంకరమైన విలన్ పాత్ర ఒకటి చేయాలనుందని తెలిపింది.  

 

ఆ పాత్రలో తనను ఆడవారే ద్వేశించేలా ఉండాలని.. అలాంటి పాత్రల్లో అసలైన నటన, ప్రతిభ కనపడుతుందని అన్నారు.  గ్లామర్ తరహా పాత్రల్లో ఎవరైనా నటిస్తారని.. కానీ వెండి తెరపై చాలెంజింగ్ రోల్స్ చాలా తక్కువ వస్తాయని అన్నారు. ప్రస్తుతం ‘ఫ్యామిలీ మేన్2’ వెబ్ సిరీస్ లో నటిస్తున్నా. ఇందులో నెగటివ్ రోల్ చేస్తున్నా. అంతేకాదు ఫైట్స్ కూడా చేస్తా. డూబ్ లేకుండా ఫైట్స్ చేశాను. ఐతే, పూర్తి స్థాయిలో విలన్ పాత్రని చేయాలని.. ఆ పాత్రతో సినిమాలకి గుడ్ బై చెప్పాలని ఉందని సామ్ తెలిపింది.  మరి వెండితెరపై సమంత కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: