సాధారణంగా సెలబ్రెటీలను ఇంటర్వ్యూ తీసుకునే సమయంలో యాంకర్ ఎన్నో ఛమత్కారమైన ప్రశ్నలు వేస్తుంటారు. ఇక ఆ సెలబ్రెటీలు లవర్స్ అన్న విషయం తెలిస్తే.. డేటింగ్ లో ఉన్నారన్న విషయం తెలిస్తే.. ఇంకాస్త ముందుకు వెళ్లి వారి పర్సనల్ లైఫ్ గురించి కూడా ఆరాలు తీస్తుంటారు. ఆ సమయంలో సెలబ్రెటీలు సైతం సమయస్ఫూర్తితో సమాధానాలు చెబుతుంటారు.. మరికొంత మంది చిర్రెత్తుకొచ్చి మద్యలోనే లేచిపోవడం కూడా జరుగుతుంది. తాజాగా బాలీవుడ్ నటులు దిశా పటానీ, ఆదిత్య రాయ్ కపూర్లకు ఓ యాంకర్ నుంచి షాకింగ్ ప్రశ్న ఎదురైంది. దాంతో వారిద్దరూ షాక్ తిన్నారు.. కానీ చాలా తెలివిగా సమాధానం చెప్పారు. ఇటీవల వీరిద్దరూ కలిసి నటించిన ‘మలంగ్’ లో ఇద్దరి మద్య చాలా బోల్డ్ సీన్లు ఉన్నాయి.
బీచ్లో ఆదిత్య దిశాను భుజంపై కూర్చోబెట్టుకుంటే.. దిశ ముందుకు వంగి మరీ అతనికి లిప్ లాక్ ఇచ్చే సీన్ ఒకటి ఉంది. ఈ పోస్టర్స్ చూస్తేనే ఈ మూవీలో ఎంత బోల్డ్ కంటెంట్ ఉందో తెలిసిపోతుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇద్దరూ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక యాంకర్ ‘ట్రూత్ షాట్స్ ఛాలెంజ్’ పేరుతో వారిద్దరినీ అడగకూడని ప్రశ్న ఒకటి అడిగింది. ‘మీరిద్దరూ బీచ్లో రొమాంటిక్ సన్నివేశాలు చేశారు కదా. బీచ్లో సెక్స్ చేశారా?’ అని అడిగారు.. అంతే ఆ ప్రశ్న విని ఇద్దరూ షాక్ కి గురయ్యారట.. ఇలాంటి ప్రశ్నలు అడిగుతారా అని ఒకంత నొచ్చుకున్నట్లు సమాచారం.
కాగా, ఈ ప్రశ్నకు దిశ స్పందిస్తూ.. ‘ఇలాంటి వ్యక్తిగత ప్రశ్నలు మాత్రం అడగొద్దు’ అని మాటదాటేసింది. అయితే ఆదిత్య మాత్రం డైరెక్టర్ గా సెక్స్ లాంటివి చేయలేదు అని నిర్మొహమాటంగా చెప్పేశాడట. ట్విస్ట్ ఏంటంటే.. యాంకర్ అడిగిన ప్రశ్నకు అసలు అర్థం అదికాదట... ‘సెక్స్ ఆన్ ది బీచ్’ పేరుతో ఓ డ్రింక్ ఉంది. ఇద్దరూ ఎప్పుడైనా ఈ డ్రింక్ తాగారా అని ఇన్ డైరెక్ట్గా అడిగారు. ఎంత కూల్ డ్రింగ్ పేరు అది అయితే మాత్రం ఇలా సెలబ్రెటీలను పట్టుకొని ఇలాంటి బోల్డ్ ప్రశ్నలు అడగడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.