పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు కమిట్ అవుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాలను.. సినిమాలను బ్యాలన్స్ చేస్తూ ఆయన సినిమాలకు సైన్ చేయటం అభిమానులకు ఆనందాన్ని ఇస్తోంది. ఇప్పటికే మూడు సినిమాలకు సైన్ చేసిన పవన్ కల్యాణ్ మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకూ సైన్ చేసిన మూడు సినిమాల్లో హరీశ్ శంకర్ సినిమా ఒకటి. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.

 

 

వీరిలో ప్రధానంగా పూజా హెగ్డే, శృతి హాసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో శృతి హాసన్ పేరు ఫైనల్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఫిల్మ్ నగర్ న్యూస్ గా ఉంది. నిజానికి ఈ ఇద్దరు హీరోయిన్లు దర్శకుడు హరీశ్ శంకర్ కు లక్కీ చార్మ్ గా మారారనే చెప్పాలి.  గబ్బర్ సింగ్ తో పవన్ తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శృతి హాసన్ కాంబోనే రిపీట్ చేయాలని హరీశ్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే.. తన దర్శకత్వంలో రెండు హిట్ సినిమాలకు పని చేసిన పూజా హెగ్డే పేరును కూడా హరీశ్ శంకర్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ కాంబో అయితే కొత్తగా ఉంటుందని కూడా భవిస్తున్నాడట. గబ్బర్ సింగ్ లో పవన్ కు మంచి జోడీ అనిపించున్న శృతి హాసన్  కాటమరాయుడు సినిమాలో మాత్రం బిలో యావరేజ్ లుక్స్ తో విమర్శలకు గురైంది.

 

 

ఈమధ్య శృతి లుక్స్ బాగుండటం.. లవ్ ఎఫైర్ నుంచి దూరంగా ఉండటంతో అందంగా ఉందనే టాక్ వస్తోంది. దీంతో దర్శకుడు హరీశ్ శంకర్ శృతి వైపే మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పైగా సెంటిమెంట్ ప్రకారం హిట్ కాంబో కూడా కావటం కలిసొస్తోందని సమాచారం. ఇందుకు పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ న్యూస్ పై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: