ఒక్క బ్లాక్  బస్టర్ పైకి లేపేస్తుంది. ఒక్కడిజాస్టర్ ఎంతటివాడినైనా కింద పడేస్తుంది. ప్రభాస్ తో సాహో సినిమా తీసి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు సుజిత్. సినిమా ఫ్లాప్ తో ఇంతవరకు కనిపించలేదు. మూడో సినిమాను ఏ హీరోతో ఒకే చేయించుకున్నాడో తెలుసా..!

 

సాహో రిలీజై ఐదు నెలలు దాటింది. ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ డార్లింగ్ మూవీతో బిజీ అయిపోయాడు గానీ.. సుజిత్ మాత్రం ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. సాహో రిలీజ్ తర్వాత సుజిత్ పై చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ప్రభాస్ ఇమేజ్ ని  డామేజ్ చేశాడని.. నిర్మాతలతో భారీగా ఖర్చు చేయించాడని విమర్శలు ఎదుర్కొన్నాడు. 

 

సుజిత్ తర్వాత రామ్ చరణ్ కోసం కథ రాస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత సుజిత్ సినిమా మొదలు పెట్టే అవకాశం ఉందట. ఇక సాహో నిర్మాతలు యూవీ క్రియేషన్సే ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. 

 

రామ్ చరణ్, సుజిత్ కాంబినేషన్ పై మెగా ఫ్యాన్స్ లో గందరగోళం నెలకొంది. ట్రిపుల్ ఆర్ తర్వాత కెరీర్ ను ఫ్లాప్ డైరెక్టర్ చేతిలో పెట్టడం ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు. రామ్ చరణ్ కు కథ చెప్పి ఒప్పించడం అంత ఈజీ కాదు. చెర్రీతో పాటు మెగాస్టార్ కు కూడా కథ నచ్చాలి. ట్రిపుల్ ఆర్ వాయిదాతో జూన్ వరకు ఇదే సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ కు కథ చెప్పి ఒప్పించడం అంత ఈజీ  కాదు. చెర్రీతో చిరుకు కూడా కథ నచ్చాలి. ట్రిపుల్ ఆర్ వాయిదాతో జూన్ వరకు ఇదే సినిమా షూటింగ్ లో ఉంటాడు చెర్రీ. ఈలోగా కథతో పాటు ఫుల్ స్క్రిప్ట్ తో సుజిత్ మెప్పిస్తాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: