టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బద్రి అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నటి అమీషా పటేల్. అంతకముందు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సరసన కహో నా ప్యార్ హై అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన అమీషా, తన అందం, నటనతో ఆకట్టుకోవడంతో పూరి, తాను పవన్ తో తీసే బద్రి సినిమా కోసం ఆమెను ఒక హీరోయిన్ గా ఎంపిక చేయడం జరిగింది. ఇక అప్పట్లో పెద్ద హిట్ కొట్టిన ఆ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టి అమీషా పై పడింది. అయితే వెంటనే మాత్రం ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. 

 

అనంతరం కొంత గ్యాప్ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో నాని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నరసింహుడు సినిమాల్లో నటించిన అమీషాకు ఆ రెండు సినిమాలు కూడా  ఘోరంగా ఫ్లాప్ అయి, టాలీవుడ్ లో హీరోయిన్ గా ఆమె ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లాయి. ఇక మధ్యలో కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి మంచి పేరు సంపాదించిన అమీషా పటేల్, ప్రస్తుతం అక్కడ మూడు సినిమాల్లో నటిస్తోంది. నిజానికి కొద్దిరోజలుగా ఆమెకు పెద్ద సినిమా ఆఫర్లు ఏవి రాకపోవడంతో, తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు మంచి హాట్ గా ఉన్న ఫోటోలు పోస్ట్ చేస్తూ దర్శక, 

 

నిర్మాతలను తన వైపునకు త్రిప్పుకోవాలని చూస్తోంది అమీషా. అందులో భాగంగా ఇటీవల ఒక బీచ్ ఒడ్డున బ్లూ కలర్ జీన్స్, యెల్లో, తో పాటు బ్లాక్ కలర్ టాప్ వేసుకుని తన యద అందాలు కనపడేలా ఫోటోలు దిగి పోస్ట్ చేసింది అమీషా. ఇక ఆ ఫోటోలను చూసిన పలువురు నెటిజన్లు, మీకు వయసు పెరుగుతుంది కేవలం పేరుకే అని, అది మీ అందానికి కాదని ఆమె పై ఒకింత సరదాగా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: