ఒక సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉంటాయి. కొన్ని చోట్ల అయితే అవి ఒక రేంజ్ లో లో జరుగుతాయి. కానీ ఫ్యాన్ వార్స్ అనగానే సౌత్ లో హీరోల అభిమానులు అందరికీ గుర్తు వచ్చేది ఇళయదళపతి విజయ్ మరియు తల అజిత్ అభిమానులే. వీరిరువురి ఫ్యాన్స్ చీటికిమాటికి సోషల్ మీడియాలో మరియు బయట గొడవ పడడం తరచూ చూస్తూనే ఉంటాం. వీరి పైత్యం ఎంతవరకు వెళ్ళింది అంటే చివరికి అజిత్ మరియు విజయ్ మరణించినట్లు ఫేక్ ప్రచారం చేసుకునే వరకు.

 

అయితే తాజాగా మాస్టర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విజయ్ పై ఐటి అధికారులు షూటింగ్ సెట్ లోనే దాడులు జరిపి అతనిని రెండు గంటల పాటు విచారించారు. తర్వాత విజయ్ నివాసం నుంచి దాదాపు 67 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే విజయ్ పై రాజకీయ కక్షతో ఐటీ దాడులు జరుపుతున్నారని ఆయన అభిమానులు చెబుతుండగా చిత్రం షూటింగ్ జరుగుతుంటే మధ్యలో ఊహించని విధంగా దాడి జరిపిన ఐటి అధికారుల పై మరికొందరు దుమ్మెత్తి పోస్తున్నారు.

 

ఇదిలా ఉండగా గతంలో అజిత్ ఐటి దాడుల గురించి చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. పన్ను రేట్లు, టాక్సుల శాతం పెంచడం.. ఆపై సెలెబ్రిటీలపై రైడ్స్ పేరుతో విరుచుకుపడడం లాంటి చర్యలు ఆపండి. ప్రజల సొమ్ముని సినిమా సెలెబ్రిటీలు దోచుకోవడం లేదుడబ్బంతా అవినీతిపరులైన రాజకీయ నాయకుల వద్దే ఉంది. ఒక సారి అవినీతిపరులైన రాజకీయ నాయకులందరిపై రైడ్స్ చేయండి. దేశంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అని అజిత్ గతంలో ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

 

 

దీంతో అజిత్ గతంలో అన్న మాటలు విజయ్ ఫ్యాన్స్ కు చాలా ఆనందాన్ని కలిగించాయి అని చెప్పాలి దీనితో అయినా వీరివురి ఫ్యాన్స్ మధ్య గొడవలు ఆగిపోవాలని అందరం కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: