డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ రెండో సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఆ సమయంలో వరస ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో అదిరిపోయే సూపర్ హిట్ రావడంతో కెరీర్లోనే రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పనుల్లో నిమగ్నమైన హరీష్ శంకర్ మరోపక్క సినిమాలో నటించే నటీనటులను సెలెక్ట్ చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఇండస్ట్రీలో సెంటిమెంట్లను ఎక్కువగా ఫాలో అయ్యో డైరెక్టర్ గా పేరొందిన హరీష్ శంకర్...పవన్ కళ్యాణ్ సినిమా కోసం కూడా సెంటిమెంట్ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.

 

విషయంలోకి వెళితే గతంలో తన దర్శకత్వంలో డీజే, గద్దలకొండ గణేష్ సినిమాలతో అదిరిపోయే బ్రేక్ హిట్ తనకి రావడంతో ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజ హెగ్డే నీ తన లక్కీ హీరోయిన్ గా హరీష్ శంకర్ భావిస్తున్నట్లు దీంతో పవన్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో పూజా తో పాటు  కియారా అద్వానీ కూడా నటించబోతున్నట్లు ఆమె ఒప్పుకున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి.

 

గతంలో ఈ సినిమాలో శృతి హాసన్ ని తీసుకోవాలని హరీష్ ప్రయత్నాలు చేసినట్లు వార్తలు రాగా తాజాగా పూజా హెగ్డే, కియారా అద్వానీ పవన్ సినిమాల్లోకి తీసుకోవడానికి హరీష్ కమిట్ అయినట్లు సమాచారం. అంతే కాకుండా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ని ఓకే చేసినట్లు కూడా టాక్ వినబడుతోంది. దీంతో గబ్బర్ సింగ్ అనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత హరీష్ దర్శకత్వంలో పవన్ ఈ సినిమాలో నటించడంతో పవన్ కళ్యాణ్ అభిమానుల లో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: