ఎన్టీఆర్ఎన్టీఆర్ కి మనవడిగా, నందమూరి నట వారసుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టేటస్ ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరో. విపరీతమైన నందమూరి అభిమానులు సొంతం చేసుకొని తాతకు తగ్గ మనవడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో చిరకాలం చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ త్రివిక్రం దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమా తో... సక్సస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. చాలా కాలం తర్వాత మంచి యాక్షన్ సినిమాతో అదరగొట్టాడు. ఇక తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. 

 

ప్రస్తుతం తెలుగులోనే కాదు నార్త్ సౌత్ మొత్తం లో చూస్తే రాజమౌళి సినిమా అంటే భారీ హిట్ గ్యారెంటి అన్న నమ్మకం కలిగింది. ప్రేక్షకుల తో పాటు ఇండస్ట్రీలోని వారందరు జక్కన్న సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్సైపోయి ఉన్నారు. ఎందుకంటే ఇప్పుటి వరకు ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి తో కలిసి మూడు బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నాడు. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ్. ఈ సినిమాలు ఎంతటి ఘన విజయాన్ని అందుకున్నాయో అందరికి తెలిసిందే. అందుకే ఇప్పుడు జక్కన్న తెరకెక్కిస్తున్న్ భారీ సినిమా ఆర్.ఆర్.ఆర్ భారీ అంచనాలున్నాయి. కాకపోతే దాదాపు అనుకున్న దానికంటే ఆరు నెలలు వెనక్కి వెళ్ళడంతో అటు మెగా అబిమానులు, ఇటు నందమూరి అభిమానుల తో పాటు ప్రేక్షకులు కాస్త నిరాశ చెందారి.

 

ఇదిలా ఇంటే తాజా ఎన్టీఆర్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు. బాల నటుడిగా గుణశేఖర్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ రాముడిగా నటించిన సినిమా ‘రామాయణం’. ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది ఈ సినిమా. అయితే చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్‌ ఎంత అల్లరివాడో అందరికీ తెలిసిందే. సీన్ కోసం గుణశేఖర్ వొరిజినల్ విల్లు తో పాటు మరో డూప్లికేట్ విల్లు ని తయారు చేపించారట. అయితే తారక్ అల్లరి చేష్టలతో ఒక విల్లును విరగొట్టాడట. అది తెలుసుకున్న గుణశేఖర్ ఎన్టీఆర్‌ ని కోప్పడ్డాట. దాంతో ఎన్టీఆర్‌ అలిగి ..ఇక నేను ఈ సినిమా చేయను వెళ్ళిపోతాను అన్నాడటా. తర్వాత మళ్ళి బుజ్జగించి చెబితే మళ్ళీ షూటింగ్ చేశాడట. ఈ విషయాన్ని తారక్ బయట పెట్టి సరదాగా నవ్వాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: