తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయన ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా తెరకెక్కించిబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే కొరటాల శివ ఈ సినిమాను కూడా సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఈ సినిమాను దేవాలయాల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.
ఇవన్నీ పక్కన పెడితే.. కొరటాల తదుపరి చిత్రం ఎన్టీఆర్తో అంటూ కొన్నాళ్లు.. రామ్ చరణ్తో అంటూ మరికొన్నాళ్లు ప్రచారం జరిగింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యూవీ క్రియేషన్స్ వారు కొరటాల శివకు అడ్వాన్స్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. కొరటాల శివను దర్శకుడిగా పరిచయం చేసింది యూవీ క్రియేషన్స్ నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్లే. వీరిద్దరు ప్రభాస్కు సన్నిహితులు. యూవీ క్రియేషన్స్లో ప్రభాస్ హీరోగా మిర్చి చిత్రంను కొరటాల తెరకెక్కించాడు. ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అప్పటి నుండి కూడా కొరటాల జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది.
ఇక అసలు మ్యాటర్ ఏంటంటే ఎన్టీఆర్, చరన్ ఇద్దరు కొరటాల నెక్ట్స్ ప్రాజెక్ట్ తమతోనే చేయాలని ప్రెజర్ చేస్తున్నారట. దీంతో ఇద్దరూ స్టార్ హీరోలే కావడంతో.. ఏం చేయాలో.. ఎవరితో నెక్ట్స్ మూవీ పట్టాలెక్కించాలో తెలియక కొరటాల సతమతమవుతున్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జక్కన్న `ఆర్ఆర్ఆర్` సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్తో పాటు రామ్ చరణ్ ఏ దర్శకుడితో నెక్ట్స్ మూవీ చేయాలనే దానిపై ఇప్పటికీ మిస్టరీలా ఉంది. ఈ క్రమంలోనే ఏ దర్శకుడితో ఎటువంటి సబ్జెక్ట్తో ఈ స్టార్ హీరోలు చేస్తారనే దానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.