టాలీవుడ్ లోకి పదేళ్ల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల విరామం తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు.  ఈ మూవి సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  అప్పటి వరకు మెగాస్టార్ ఎంట్రీపై రక రకాల అనుమానాలు ఉన్నా.. ఈ మూవీతో అవన్నీ పటాపంచలైపోయాయి.  అప్పటి వరకు మెగాస్టార్ స్టామినాపై రక రకాల అనుమానాలు ఉన్నా అవన్నీ దూరమయ్యాయి.. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ తెగ సంబరపడిపోయారు ఫ్యాన్స్.  ఇదే ఊపుతో చిరంజీవి ఎప్పటి నుంచో కంటున్న కల ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుక వచ్చారు.

 

 కానీ ఈ మూవీ అంచనాలు దారుణంగా తప్పిపోయాయి. రూ.300 కోట్లకు పైగా ఖర్చు పెట్టి తెలుగు, మళియాళ, కన్నడ భాషల్లో ఈ మూవీ తెరకెక్కించారు.  అయితే మూవీ మాత్రం దారుణమైన టాక్ వచ్చింది.  తెలుగులో అంతంత మాత్రమే అయినా.. ఇతర భాషల్లో మాత్రం డిజాస్టర్ టాక్ వచ్చింది. దాంతో తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టారు మెగాస్టార్ చిరంజీవి.  సినిమా రిలీజ్‌కి రెడీ అవుతుంటే మ‌రో చిత్రాన్ని లైన్‌లో పెడుతున్నారు. తాజాగా `సైరా` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మెగాస్టార్ చిరంజీవిసినిమా థియేట‌ర్ల‌లో వుండ‌గానే మ‌రో మూవీ మొద‌లుపెట్టేశారు.  కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

 

రామ్‌చ‌రణ్‌తో క‌లిసి కొర‌టాల శివ స్నేహితుడు నిరంజ‌న్‌రెడ్డి ఈ మూవీ నిర్మిస్తున్నారు. చిరు ఎండోమెంట్ అధికారిగా న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ నాన్ స్టాప్‌గా జ‌రుగుతోంది.  కొర‌టాల శివ ఈ చిత్రాన్ని కూడా అదే పంథాలో రూపొందిస్తున్నారు. త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ మూవీ కోసం `ఆచార్య` అనే టైటిల్‌ని చిత్ర బృందం రిజిస్ట‌ర్ చేయించింది.  మొత్తానికి అన్ని హంగులతో చిరు సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: