ప్రభాస్ జిల్ రాథా కృష్ణల మూవీ షూటింగ్ ఇప్పుడు వేగం పుంజుకుంది. ఈ మూవీని త్వరగా పూర్తిచేసి ఈ సంవత్సరం దసరా రేస్ కు తీసుకురావాలని ప్రభాస్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ గా ‘రాధే శ్యామ్’ ఎంపిక చేయడంతో త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుంది అంటున్నారు. 


ఇలాంటి పరిస్థితులలో ఈ సినిమాలోని కొన్ని కీలక పాత్రలకు కొందరు రిటైర్మెంట్ బ్యాచ్ ఎంపిక కావడం హాట్ న్యూస్ గా మారింది. ఈ మూవీలో ఒక కీలక పాత్రను కృష్ణంరాజు పోషిస్తున్నట్లు టాక్. ఈ మూవీలో అతడు పోషించే పాత్ర జమిందారీ పాత్ర ఛాయలో ఉంటుంది అని అంటున్నారు. 


ఒకప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన భాగ్యశ్రీ కూడ ఈ మూవీలో మరొక కీలక పాత్రను పోషిస్తోంది. వీరిద్దరు కాకుండా ఒకప్పుడు డిస్కో డాన్సర్ గా బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసిన మిదున్ చక్రవర్తి కూడ ఈ సినిమాలో మరొక పాత్రకు ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వీరు ముగ్గురుకి సంబంధించిన ఎంపిక వార్తలు బయటకు లీక్ కావడంతో ప్రభాస్ మూవీలో ఈ రిటైర్మెంట్ బ్యాచ్ ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో జోక్స్ పడుతున్నాయి. వాస్తవానికి ఈ మూవీని హిందీలో కూడ విడుదల చేస్తున్నారు. 


ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం ఏమాత్రం క్రేజ్ లేని ఈ ముగ్గురితో ప్రభాస్ మూవీకి పాన్ ఇండియా ఇమేజ్ ఎలా ఏర్పడుతుంది అంటూ కొందరు షాక్ అవుతున్నారు. ఈ కామెంట్స్ అన్నీ ప్రభాస్ అభిమానుల దృష్టికి రావడంతో మళ్ళీ ప్రభాస్ మరొకసారి ప్రయోగం చేస్తున్నాడా అంటూ అతడి అభిమానులు కలవర పడుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ దర్శకుడు జిల్ రాథా కృష్ణ సమర్ధత పై నమ్మకంలేని పరిస్థితులలో ఇప్పుడు ఈ ప్రయోగం అవసరమా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: