రాజమౌళి కొరటాల శివ ల తరువాత ఇండస్ట్రీ హిట్ డైరెక్టర్ గా ఒక ఇమేజ్ ఏర్పరుచుకున్న అనీల్ రావిపూడి అంచనాలకు తగ్గట్టుగా ‘సరిలేరు నీకెవ్వరు’ ఇండస్ట్రీ హిట్ గా మారకపోయినా అతడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దీనితో అనేకమంది అనీల్ రావిపూడి తో సినిమాలు తీయాలని తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 


అయితే అనీల్ రావిపూడి దృష్టి మాత్రం టాప్ యంగ్ హీరోల పై ఉండటంతో ఈ డైరెక్టర్ ప్రస్తుతానికి ఎవరికీ మాట ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితులలో వీలైనంత త్వరలో ‘ఎఫ్ 3’ మొదలుపెట్టి ఆ మూవీని పూర్తిచేయమని దిల్ రాజ్ ఒత్తిడి చేస్తున్నా ఆ మూవీ కథ విషయంలో అనీల్ రావిపూడి కి చిన్న కన్ఫ్యూజన్ ఉన్నట్లు టాక్. 


ఈ పరిస్థితులు ఇలా ఉంటే ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ మూవీ షూటింగ్ ఇంచుమించు పూర్తి అయిపోవడంతో అఖిల్ తో ఒక సినిమాను తీయమని నాగార్జున అనీల్ రావిపూడిని ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. అయితే ఇప్పటికే ‘సరిలేరు నీకెవ్వరు’ తో ఒక చిన్న షాక్ కు గురైన అనీల్ ఈ పరిస్థితులలో అఖిల్ తో సినిమా చేయడం కంటే ‘ఎఫ్ 3’ ప్రాజెక్ట్ తో ముందుకు వెళ్ళడం మంచిది అన్న భావనలో ఉన్నట్లు టాక్. 


వాస్తవానికి ఈ మూవీలో ముగ్గురు హీరోలు అవసరం అయిన నేపధ్యంలో వెంకటేష్ వరుణ్ తేజ్ లతో పాటు అఖిల్ కు మూడవ హీరోగా అవకాసం ఇస్తాడా లేదంటే మహేష్ కోసమే తన ఒత్తిడిని కొనసాగిస్తాడా అన్న విషయమై సస్పెన్స్ కొనసాగుతోంది. నాగార్జున అఖిల్ ను సెటిల్ చేయడానికి త్రివిక్రమ్ అనీల్ రావిపూడి లాంటి క్రేజీ దర్శకులకు భారీ ఆఫర్లు ఇస్తున్నా అఖిల్ పేరు చెప్పగానే వారు మౌనం వహించడం సమాధానం లేని ప్రశ్న. దీనితో నాగ్ ఒత్తిడి కనీసం అనీల్ రావిపూడి పై పనిచేస్తుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: