హ్యాపీ డేస్ సినిమా తర్వాత తెలుగు ప్రేక్షక అభిమానులకు బాగా దగ్గరైన నటుడు నిఖిల్. ఆ చిత్రంలో తన ముచ్చటైన రొమాంటిక్ క్యారెక్టర్ తో బాగా అలరించిన నిఖిల్... ఆ తర్వాత కూడా మంచి సినిమాలను తీసి కుర్ర హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. కొన్ని నెలల క్రితం నిఖిల్ ఒక షోలో తాను ఒక వైద్యురాలిని ప్రేమిస్తున్నానని కచ్చితంగా పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. కానీ ఆమె పేరుని మాత్రం రహస్యంగా ఉంచాడు. నిఖిల్ ఈ సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆ అమ్మాయి ఎవరై ఉంటుందబ్బా అంటూ అభిమానులు తెగ చర్చించుకున్నారు. 

 


అయితే ఇటీవల నిఖిల్ తను చెప్పిన మాటలను నిజం చేస్తూ పల్లవి వర్మ అనే ఒక డాక్టర్ తో డీసెంట్ ఈవెంట్ లో నిశ్చితార్థం చేసుకుని తన అభిమానులకు ఝలక్ ఇచ్చాడు. వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ పెద్దల అంగీకారంతో జరిగింది. వాస్తవానికి పల్లవి వర్మకి తన మోకాలు పై కూర్చొని సినిమాల్లో హీరోలు హీరోయిన్ కి ప్రపోజ్ చేసినట్టు నిఖిల్ కూడా చేసి పల్లవి మనసును దొంగలించాడు. అయితే ఇదంతా గోవాలో జరిగింది. విశేషమేమిటంటే గోవాలోనే తన నిశ్చితార్థం కూడా జరుపుకున్నాడు నిఖిల్. దానికి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకొని తన నిశ్చితార్థం జరిగిందని తన అభిమానులకు తెలియపరిచాడు. ఇకపోతే ఇరువురు కుటుంబ సభ్యులు నిఖిల్-పల్లవి లు మ్యారేజ్ చేసుకునేందుకు అంగీకరించడంతో... ఏప్రిల్ 19న వీరిద్దరి పెళ్లి ఫిక్స్ అయ్యింది. 

 


అయితే వీరిద్దరి పెళ్ళికి ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో.. నిఖిల్ తన కాబోయే భార్యకి ఎన్నో సర్ప్రైజ్ లను ఇస్తూ తనను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ప్రేమికుల రోజు అయిన వాలెంటైన్స్ డే ఇప్పటికే స్టార్ట్ కావడంతో.. నిఖిల్ తన భార్యకి అత్యంత విలువైన ఐ ఫోన్ ప్రో మాక్స్ కొనిచ్చాడట. ఏడు రోజులు జరుపుకునే ప్రేమికుల రోజుని నిఖిల్ పల్లవి వర్మలు బాగా జరుపుకుంటున్నారట. ఐఫోన్ ప్రో మాక్స్ కొనిచ్చినందుకు నిఖిల్ కోసం పల్లవి తనకిష్టమైన రొయ్యల కూరని చేసి పెట్టిందట. దీంతో నిఖిల్ ప్రియురాలు తనకిష్టమైన రొయ్యల కూర చేయడంతో లొట్టలేసుకుంటూ తిన్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: