టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా సినిమా అలవైకుంఠపురములో ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించింది. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు. హారిక హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ బ్యానర్స్ పై అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ కలిసి నిర్మించిన ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఒక కీలక పాత్రలో నటించింది. 

 

ఇకపోతే ఈ సినిమా మంచి హిట్ కొట్టడంతో బన్నీ సహా సినిమా యూనిట్ మొత్తం కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇటీవల విశాఖపట్నంలో సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది. అంతటితో ఆగని అల మూవీ టీమ్, కొద్దిరోజలుగా తమ సినిమా సక్సెస్ పై ఆనందంలో మునిగితేలుతూ పలు ప్రెస్ మీట్స్ కూడా నిర్వహించారు. అలానే కొద్దిరోజుల క్రితం పలువురు టాలీవుడ్ సినిమా ప్రముఖులకు ప్రత్యేక పార్టీ ఇచ్చిన అల మూవీ టీమ్, దాని అనంతరం మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక పార్టీ ని ఇవ్వడం జరిగింది. 

 

ఇక కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, అల మూవీ టీమ్ ఇప్పటివరకు ఇచ్చిన పార్టీ ల ఖర్చు దాదాపుగా ఆరుకోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. అలానే అల మూవీ సక్సెస్ అవడమతొ, నిన్న తన కుటుంబసమేతంగా తిరుమల వేంకటేశ్వరుని దర్శించిన బన్నీ, ఇకపై తన ఫ్యాన్స్ కు మంచి సక్సెస్ఫుల్ సినిమాలు అందించేలా వరుసగా ఎంతో జాగ్రత్తగా సినిమాలు చేస్తానని అన్నారు. ఇక ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న వివరాలను బట్టి చూస్తే ఈ సినిమా బన్నీ కెరీర్ లో పెద్ద హిట్ గా నమోదు అవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో నాన్ బాహుబలి 2 విజయాన్ని కూడా సొంతం చేసుకోగా, అటు ఓవర్సీస్ లో అయితే బాహుబలి రెండు సినిమాల తరువాత అత్యధిక వసూళ్లు అందుకున్న తెలుగు సినిమాగా రికార్డు హిట్ గా నిలిచింది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: