సినీ నటుడి గానూ, రాజకీయ వేత్త గానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు బండ్ల గణేష్. మొదట సినిమాల్లో నటించి ఆ తర్వాత నిర్మాతగా మారి.. రాజకీయరంగంలోకి కూడా దిగేశాడు ఈ కమెడియన్. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెగ హంగామా చేసి అందరి చూపు తనవైపు తిప్పుకున్న ఈయన.. ఎలక్షన్స్ అనంతరం సైలెట్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ గురించైనా.. మెగాస్టార్ చిరంజీవి విషయమైనా బండ్ల గణేష్ మాటల ప్రవాహాం ఏ రేంజ్‌లో ఉంటుందో ఇదివరకే ఎన్నో ఈవెంట్లలో చూశాం. బండ్ల గణేష్‌కు మైకు ఇస్తే.. ఎదురుగా పవన్ కళ్యాణ్ ఉంటే ఆ మాటల ధాటిని ఆపడం ఎవరి తరమూ కాదు. మాటల మాంత్రికుడిని మించి పదునైన డైలాగ్స్‌తో పవర్ స్టార్‌ను ఆకశానికెత్తేస్తాడు.

 

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హల్ చల్ చేసిన బండ్ల గణేష్ ఆపై సైలెంట్ అయిపోయాడు. తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇకపై రాజకీయాల్లోకి వెళ్లనని, తనకు సినిమాలే ప్రాణమని, సినిమా వాడిగానే బతుకుతానని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా చడీచప్పుడూ లేకుండా ఉన్న బండ్ల గణేష్.. తిరిగి రాజకీయాల వైపు చూస్తున్నాడు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ పార్టీ తరఫున ప్రచారం చేసిన ఈ కమెడియన్ ఇప్పుడు మళ్ళీ పవన్ పాట పాడుతున్నాడు. ఉన్నట్లుండి ఈయన మళ్లీ పవన్ కళ్యాణ్‌కు జై అనేయడం జనాల్లో హాట్ ఇష్యూగా మారింది.

 

కళ్ళల్లో కసి ముక్కు మీద పౌరుషం మీసంలో నిజాయితీనీ సొంతం బాస్.. అడిగితే ఇచ్చేది ప్రసాదం పూజిస్తే వచ్చేది వరం నాకు కావాల్సింది వరం లాంటిది జీవితం అది తప్పకుండా వస్తుంది.. దేవుని అడగకూడదు తప్పు !కోరుకోవాలి అప్పుడే కోరిక తీరుతుంది. అంటూ భారీ డైలాగ్‌లే కొట్టాడు. ఇదంతా పవన్‌తో సినిమా నిర్మించడం కోసమేనని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: