టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన  ‘ఇద్దరమ్మాయిలతో..’ చిత్రంలో ఆకాంక్షగా మెప్పించి.. తన అందాలతో తెలుగు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన నటి కేథరిన్‌.  మరోసారి అల్లు అర్జున్ సరసన ఆ తర్వాత ‘సరైనోడు’ సినిమాతో ‘ఎమ్మెల్యే’గా అలరించింది. అయితే కేథరిన్ టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించిన సరైన హిట్ మాత్రం దక్కించుకోలేక పోయింది.   తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రంలో కేథరిన్ తో పాటు రాశీఖన్నా, ఐశ్వర్యరాజేశ్, ఇజబెల్లా లైట్ కూడా హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 14న వేలైంటెన్స్ డే స్పెషల్ గా ఈ సినిమా విడుదల కానుంది.   ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’, ‘ఓనమాలు’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రాంతిమాధవ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమా గురించి నటి కేథరిన్‌ విలేకర్లతో ముచ్చటించారు.   బాక్సాఫీస్ రికార్డులతో సంబంధం లేకుండా మంచి పాత్రలను పోషించాలనేదే తన ధ్యేయమంది. చిత్రం చూసినప్పుడు కేథరిన్ బాగా నటించిందని అందరూ అనుకుంటేనే తనకు తృప్తి అని తెలిపింది. 'ప్రేమను నమ్ముతాను కానీ దాని గురించి వివరించి చెప్పడం కష్టం. అది ఒక ఫీల్ గుడ్ ఎమోషన్ అని నా భావన' అంది.   చిత్రంలో సన్నివేశాలన్నీ చాలా సరదాగా సంతోషంగా సాగిపోతాయి. ఇందులో నేను స్మిత అనే అమ్మాయి పాత్రలో నటించాను.

 

బొగ్గుగనిలో అధికారిగా కనిపిస్తుంటాను. స్మిత పాత్రకు, నాకూ మధ్య చాలా పోలికలున్నాయి.  ఇక హీరో విజయ్ గురించి మాట్లాడుతూ.. చాలా కామ్ స్మార్ట్ అని చెప్పింది.  సెట్ లో చాలా జాలీగా.. హ్యాపీ మూడ్ తో ఉంటారు.  సినీయర్లుకు చాలా గౌరవం ఇస్తారని.. తన పని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని అన్నారు. ఇటీవల ప్రారంభమైన బోయపాటి-బాలకృష్ణ సినిమాలో నేను నటిస్తున్నానంటూ చాలా చోట్ల వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా చిత్ర బృందం నన్ను సంప్రదించినట్లు చెప్పుకుంటున్నారు. ఆ విషయం బోయపాటిని అడిగి తెలుసుకుంటేనే బెటర్ అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: