మొన్నటి వరకు సినిమాలకు పూర్తిస్థాయిలో గుడ్బై చెప్పి రాజకీయాల్లో కొనసాగిన పవన్ కళ్యాణ్ ఇక తాజాగా సినిమాల్లోకి రీ  ఏంట్రీ ఇవ్వడంతో అభిమానులు అందరూ ఫుల్ ఖుషీ అయిపోయారు. సినిమాల్లోకి రావడమే కాదు వరుస సినిమాలకు కూడా చేసేందుకు సిద్ధం కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్  దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ హిట్ మూవీ పింక్  తెలుగు రీమేక్లో నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్రల్లో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతుంది. 

 


 ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చారిత్రాత్మక చిత్రంలో కూడా పవన్ కళ్యాణ్ నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కూడా ఈ నెల 27న మొదలు కానుంది. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ లాంటి మంచి హిట్ ను అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే దర్శకుడు క్రిష్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చారిత్రాత్మక సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటు గా కనిపించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన బాలీవుడ్  అందాల ముద్దుగుమ్మ కైరా అద్వానీ తీసుకోవాలనే ఉద్దేశంతో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. 

 

 పవన్ కళ్యాణ్ కైరా అద్వానీ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది అని పవన్  అభిమానులు కూడా భావించారు.కానీ  అభిమానులకు నిరాశే ఎదురైనట్లు  తెలుస్తోంది. ఎందుకంటే క్రిష్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయకిగా కైరా అద్వానీని  నటింపజేసేందుకు చిత్ర బృందం సంప్రదింపులు జరిపినప్పటికీ పవన్ కల్యాణ్ సినిమాకు బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ కైరా అద్వాని నో చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. డేట్లు ఖాళీ లేవని చెప్పిందట.దీంతో  మరో బాలీవుడ్ భామ వాణీ కపూర్ ను పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు క్రిష్. కాగా 2014 లో వచ్చిన ఆహా కళ్యాణం సినిమాలో నాని కి జోడిగా వాణికపూర్ కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: