శర్వానంద్, సమంత జంటగా నటించిన జాను సినిమా శుక్రవారం గ్రాండ్ గా రిలీజైంది. కోలీవుడ్ లో సూపర్ హిట్టైన 96 మూవీని తెలుగులో జానుగా రిలీజ్ చేశారు. మాత్రుక దర్శకుడు ప్రేమ్ కుమార్ డైరక్షన్ లో తెరకెక్కిన జాను నిన్న రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు తెలుగు రెండు రాష్ట్రాల్లో 2.12 కోట్ల షేర్ రాబట్టింది.  

 

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష అద్భుతంగా నటించగా తెలుగులో వారికి ఏమాత్రం తీసిపోని విధంగా శర్వా, సమంతల నటన ఉంది. ప్రత్యేకంగా చెప్పుకుంటే జాను పాత్రలో సమంత ది బెస్ట్ అందించింది. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో కూడా అలరించింది.

 

తమిళంలో సూపర్ హిట్టైన ఈ సినిమాను తెలుగులో రీమేక్ అనగానే ఆ క్లాసిక్ మూవీని తెలుగులో తీసి దిల్ రాజు పాడు చేస్తాడని అందరు కామెంట్స్ చేశారు. జాను ఈవెంట్ లో దిల్ రాజు కూడా ఈ విషయంపై ప్రస్థావించారు. కాని ఫైనల్ గా దిల్ రాజు తన డెశిషన్ కరెక్ట్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. కొన్నాళ్లుగా తన బ్యానర్ లో ఫీల్ గుడ్ మూవీస్ అందించని దిల్ రాజు తన బ్యానర్ వాల్యూ ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఎంతైనా దిల్ రాజుకి ఒక సినిమా హిట్ అవుతుందా లేదా అని కనిపెట్టే తెలివితేటలు బాగానే ఉంటాయి. అదే జానుని మనముందుకు వచ్చేలా చేసింది. ఫీల్ గుడ్ మూవీగా వచ్చిన జాను సినిమా ఏరియా వైజ్ మొదటిరోజు వసూళ్ల వివరాలు చూస్తే.. 

 

నైజాం : 0.88 కోట్లు

సీడెడ్ : 0.28 కోట్లు

ఉత్తరాంధ్ర : 0.32 కోట్లు

ఈస్ట్ : 0.17 కోట్లు

వెస్ట్ : 0.10 కోట్లు

కృష్ణా : 0.15 కోట్లు

గుంటూరు : 0.16 కోట్లు

నెల్లూరు : 0.65 కోట్లు

ఏపి/తెలంగాణ : 2.12 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి: