ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే కత్తి మహేష్ తాజాగా మరో వివాదంతో వార్తల్లోకెక్కాడు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో కత్తి మహేష్ మాట్లాడుతూ హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే శ్రీరాముడు పచ్చి తిరుగుబోతు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. శ్రీరాముడు స్త్రీలోలుడు అంటూ కామెంట్లు చేసి మరో వివాదానికి కత్తిమహేష్ తెరతీశాడు. 
 
హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలో బహుజన సాహిత్య జాతర పేరిట ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన కత్తిమహేష్ తన అంతఃపురంలో శ్రీరాముడు మహిళలతో సరససల్లాపాలు సాగించేవాడని అన్నారు. కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు కత్తి మహేష్ ను విమర్శిస్తున్నారు. 
 
తాజాగా ఫేస్ బుక్ లో కత్తి మహేష్ తాను భయంకరమైన హిందువును... జాగ్రత్త... ! అని తాను గుడ్డిగా ఫాలో అయ్యే రకాన్ని కాదని దళిత చార్వాకుడిని అంటూ వివాదాస్పద పోస్ట్ చేశారు. కత్తి మహేష్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచే విధంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 
 
హిందూ సంఘాలు కత్తి మహేష్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. క్రిటిక్ గా, నటుడిగా, దర్శకుడిగా పేరు ఉన్న కత్తి మహేష్ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యల వలన తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నాడని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ పార్టీ కార్యకర్తలు కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ సంఘాలు కత్తి మహేష్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో కూడా ప్రముఖులపై విమర్శలు చేసి వివాదాలను కొని తెచ్చుకున్న కత్తి మహేష్ ను ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని నెటిజన్లు కోరుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: