టాలీవుడ్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్.  నివాస్ దర్శకత్వంలో నా పేరు సూర్య మూవీ తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ గతంలో తనకు సూపర్ హిట్ సినిమాలు అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ మూవీలో నటించారు.  ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.  ఈ మూవీ మొదటి నుంచి భారీ అంచనాలే పెంచుతూ వచ్చింది. ముఖ్యంగా ఈ మూవీ నుంచి రిలీల్ అయిన లిరిక్స్ ‘సామ జవరగమన’, రాములో రాముల యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించాయి.  ఈ రెండు పాటలు ఎక్కడ చూసినా మారుమోగాయి. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు బాలీవుడ్ లో రిమేక్ చేస్తు మంచి విజయాలు అందుకుంటున్నారు.  

 

ఆ మద్య తెలుగు లో వచ్చిన అర్జున్ రెడ్డి, టెంపర్ మరికొన్ని సినిమాలు బాలీవుడ్ లో రిమేక్ చేసి మంచి విజయాలు అందుకున్నారు. తాజాగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్ లో వచ్చి విజయవంతమైన 'అల వైకుంఠపురములో' చిత్రం రీమేక్ రైట్స్ తీసుకున్నట్లు సమాచారం.  గతంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని కబీర్ సింగ్ గా రీమేక్ చేసి ఘన విజయం సాధించిన నిర్మాతే ఈ చిత్రం హిందీ రైట్స్ ని తీసుకున్నట్లు బాలీవుడ్ సమాచారం.

 

జనవరి 12న విడుదలైన ఈ సినిమా  అప్పటికే రిలీజ్ అయిన దర్భార్, సరిలేరు నీకెవ్వరు మూవీస్ తో పోటీ పడి సంచలన విజయం సాధించింది. ఈ మూవీతో గ్లోబల్‌ థియేట్రికల్‌ హక్కులు రూ 85 కోట్లకు అమ్ముడుపోగా దాదాపు అందరూ లాభాల బాట పట్టారు. ఇదిలా ఉంటే.. అమెరికా వీకెండ్‌ బాక్సాఫీస్‌ చార్ట్‌లో మన దేశానికి చెందిన ఐదు సినిమాలు చోటు చేసుకున్నాయి.. అందులో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ మూడీ టాప్ లో నిలవడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: