గత రెండు సంవత్సరాల నుండి వరుసపెట్టి విజయాలు సాధిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంక్రాంతి పండుగకు బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని కొత్త ఏడాదిలో అడుగుపెట్టాడు. మహేష్ బాబు కెరీర్ లోనే సరిలేరు నీకెవ్వరు సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అదిరిపోయే రికార్డులు సాధించింది. దీంతో సినిమా సక్సెస్ సంబరాల్లో చాలా హుషారుగా పాల్గొన్న మహేష్ ఇటీవల కుటుంబ సమేతంగా ఈ సక్సెస్ ని అమెరికాలో ఆస్వాదిస్తున్నారు. అమెరికానుండి వచ్చిన వెంటనే మహేష్ బాబు తన తర్వాత సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయటానికి రెడీ అయినట్లు సమాచారం.

 

ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ పనిలో వంశీ పైడిపల్లి ఉన్నట్లు ఏప్రిల్ మాసం నుండి సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు జోరుగా వినబడుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో మహేష్ పక్కన హీరోయిన్ క్యారెక్టర్లో కియారా అద్వానీ సెలక్ట్ అయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో మరియు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈ సినిమాలో మహేష్ బాబు డబుల్ రోల్ లో నటించనున్నట్లు సమాచారం. అందులో ఒకటి గ్యాంగ్‌స్టర్ పాత్ర కాగా.. మరొకటి లెక్చరర్ పాత్ర అని తెలుస్తోంది.

 

అంతేకాక ఈ సినిమా లైన్ 1995లో రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘భాషా’ సినిమా స్టైల్ లో మహేష్ సినిమా పోలి ఉంటుందని ఫిల్మ్‌నగర్ టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మునిగితేలుతున్న డైరెక్టర్ వంశీ పైడిపల్లి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ఎస్ తమన్ ని తీసుకోవడానికి ఆలోచిస్తున్నట్లు ఇదే తరుణంలో మరో హీరోయిన్ క్యారెక్టర్ లో శృతి హాసన్ ని కానీ పూజా హెగ్డే ని కానీ తీసుకోవడానికి ఆలోచిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: