ఒకప్పుడు టాలీవుడ్ హీరోల కంటే బాలీవుడ్ హీరోలకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉండేది.  అందుకే సౌత్ హీరోలు అందరూ బాలీవుడ్ లో నటించి మంచి పేరు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసే వారు. బాలీవుడ్ లో హిట్ అయితే మంచి క్రేజ్ సంపాదించచ్చని అటు హీరోయిన్లు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం బాలీవుడ్ కు మించి సౌత్ సినిమాలకు ఎంతో  క్రేజ్ వచ్చింది. సౌత్ సినిమా లోని బాలీవుడ్ సినిమాలకు మంచి హిట్ అవుతుండడం.. బాలీవుడ్ సినిమాలకు మంచి వసూళ్లు రాబడుతుండటంతో... సీన్ కాస్త రివర్సయిపోయిందే. 

 

 ఒకప్పుడు సౌత్ సినిమాల నుంచి బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపేవారు కానీ ఇప్పుడు మాత్రం బాలీవుడ్ హీరోలు సౌత్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే రోజురోజుకు సౌత్ సినిమాలకు  మార్కెట్ బాగా పెరిగి పోతుండటంతో ఇక్కడి స్టార్ హీరోలతో కలిసి  నటిస్తే వారికి కూడా మంచి మార్కెట్ పెరుగుతుందని  అన్న ఆశతో టాలీవుడ్ వైపు ఆశగా చూస్తున్నారు. 

 

 ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోల పై  బాలీవుడ్ కన్ను పడింది అని చెప్పాలి. కొంత మంది బాలీవుడ్ నిర్మాతలు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు నిర్మించేందుకు ముందుకు వెళుతుంటే... బాలీవుడ్ హీరోయిన్స్ కూడా టాలీవుడ్ హీరోలతో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు... అంతే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి పక్కన నటిస్తే... ఇక్కడ కూడా మార్కెట్ పెరుగుతుంది అని ఆశతోనే ఉన్నారు. ఇప్పటికే రజనీకాంత్ హీరోగా వచ్చిన రోబో 2.0 సినిమా లో అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటించి అదరగొడితే ఇక తాజాగా.. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో  బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత మంది బాలీవుడ్ హీరోలు టాలీవుడ్ వైపు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: