ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలకు కలెక్షన్లకు పెద్దగా ఉండేది కాదు... భారీ బడ్జెట్ సినిమాలు కూడా చాలా తక్కువే... బాలీవుడ్ సినిమాలతో పోలిస్తే టాలీవుడ్ సినిమాల కలెక్షన్లు చాలా తక్కువగా ఉండేవి. బాలీవుడ్ సినిమాలు వందలకు వందలు కోట్ల వసూళ్లు  రాబడుతుంటే... టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కూడా వందకోట్ల కలెక్షన్లను రాబట్టింది. అందుకే భారతదేశం మొత్తం బాలీవుడ్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది... ఏకంగా బాలీవుడ్ స్టార్ నిర్మాతలు దర్శకులు హీరోలు అందరూ టాలీవుడ్ వైపు ఎక్కువగా ఆశ చూపుతున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలు బాలీవుడ్ స్టార్ హీరో హీరోల కలెక్షన్స్ సైతం బద్దలుకొట్టి సంచలన రికార్డు సృష్టించాయి. 

 


 ఇప్పటికే బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తో బాలీవుడ్ లో కాసుల వర్షం కురిసింది అనే చెప్పాలి. బాలీవుడ్ స్టార్ హీరోల్లో నెలకొల్పిన రికార్డులను బాహుబలి సినిమా బద్దలుకొట్టి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇక ఆ తర్వాత ప్రభాస్ హీరోగా యాక్షన్ మూవీ  అయిన సాహో సినిమా కూడా టాక్ పరంగా అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ వసూళ్లు మాత్రం అద్భుతంగాని రాబట్టింది. ఇక బాలీవుడ్ లో అయితే ఈ సినిమా ప్రేక్షకుల అందరినీ మెప్పించి భారీ వసూళ్లు రాబట్టింది అనే చెప్పాలి. ఇక మొన్నటికి మొన్న సంక్రాంతి ముందు విడుదలైన సినిమాలకు భారీ మార్కెట్ జరిగింది. దీంతో బాలీవుడ్ దృష్టి మొత్తం టాలీవుడ్ వైపు మళ్ళింది. 

 


 ఇప్పటికే బాహుబలి సాహో సినిమాల  కలెక్షన్లతో బాలీవుడ్ హీరో దర్శక నిర్మాతలకు మైండ్ బ్లాక్ అయింది. ఇక ఇప్పుడు సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు అలా వైకుంఠపురములో  కలెక్షన్లతో మరోసారి బాలీవుడ్ మొత్తం ఆశ్చర్యపోయింది. దీంతో మొత్తం టాలీవుడ్ పైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎంతో మంది దర్శక నిర్మాతలు టాలీవుడ్ హీరోలతో కూడా సినిమాలు చేసి మంచి విజయాలను సాధించాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో ఏ సినిమా కూడా సరిగా ఆడటం లేదు సరైన వసూళ్లు  రావటం లేదు అదే సమయంలో టాలీవుడ్ లో సంచలనం వసూళ్లను రాబడుతున్నాయి సినిమాలు. దీంతో బాలీవుడ్ మొత్తం టాలీవుడ్ వైపు చూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: