టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో వరుసగా కెరీర్ పరంగా మూడు విజయాలు అందుకుని హ్యాట్రిక్ కొట్టిన విషయం తెలిసిందే. అనిల్ సుంకర, మహేష్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్, తొలిసారిగా ఒక ఆర్మీ మేజర్ పాత్రలో నటించడం జరిగింది. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించారు. ఇకపోతే ఈ సినిమా సూపర్ సక్సెస్ అనంతరం ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో టూర్ ఎంజాయ్ చేస్తున్న మహేష్

 

అతి త్వరలో తిరిగి వచ్చిన తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్ లో నటించనున్నట్లు టాక్. ఇకపోతే తాను నెలకొల్పిన జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఇప్పటివరకు తను హీరోగా నటిస్తున్న సినిమాలు మాత్రమే తీస్తున్న సూపర్ స్టార్, అతి త్వరలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమాని నిర్మించనున్నట్టు టాలీవుడ్ వర్గాల టాక్. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ తో పాటు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమాలు చేస్తున్న విజయ్, వాటి అనంతరం మహేష్ బ్యానర్ లో ఒక సినిమా చేయనున్నారట. 

 

ఇటీవల మహేష్, నమ్రతలను ప్రత్యేకంగా కలిసిన విజయ్, వారి బ్యానర్ లో సినిమా చేయడానికి మాటిచ్చాడని, అయితే ఆ సినిమాకు దర్శకుడు ఎవరు, ఎటువంటి జానర్ లో సినిమా ఉంటుంది తదితరాలు మాత్రం అతి త్వరలో తెలియనున్నాయని అంటున్నారు. ఇక ప్రస్తుతం తన జిఎంబి బ్యానర్ లో అడివిశేష్ హీరోగా మేజర్ అనే పేట్రియాటిక్ మూవీ తీస్తున్న మహేష్, తదుపరి విజయ్ తో ఎటువంటి సినిమాని నిర్మిస్తారో చూడాలి. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: