సమంత చాలా ప్లాన్డ్ గా ఉంటుంది. సినిమాలు అయినా.. రియల్ లైఫ్ అయినా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ప్రతీమాట ఆలోచించి మాట్లాడుతుంది. అలాంటి సమంత ఇప్పుడో షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. బ్రేక్ గురించి బ్రేకింగ్ న్యూస్ చెప్పి, ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది సమంత. 

 

సమంత యాక్టింగ్ లో ఎంత టాలెంటెడో.. లైఫ్ బిల్డ్ చేసుకోవడంలోనూ అంతే పక్కాగా ఉంటుంది. రియల్ లైఫ్ ను, రీల్ లైఫ్ ను పక్కాగా బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే పెళ్లి తర్వాత టాప్ లీగ్ లో దూసుకెళ్తోంది సమంత. రంగస్థలం, ఓ బేబీ లాంటి సినిమాలతో ఇమేజ్ మరింత పెంచుకుంది. అయితే కెరీర్ లో ఇంత బిజీగా ఉన్న సమంత, ఇప్పుడు బ్రేక్ గురించి మాట్లాడుతోంది. 

 

సమంత మూడేళ్ల క్రితం మిసెస్ నాగచైతన్యగా మారింది. అక్కినేని కోడలిగా కొత్త బాధ్యతలు తీసుకుంది. అయితే మూడేళ్లుగా సినిమాలు, పర్సనల్ లైఫ్ రెండు రెండు కళ్లు అన్నట్టుగా ఉన్న సామ్, ఇప్పుడు బ్రేక్ కావాలంటోంది. ఓ రెండేళ్ల తర్వాత సినిమాలు పక్కన పెట్టేస్తానని చెబుతోంది. 


సమంత లేటెస్ట్ మూవీ జాను. ఈ మూవీ ప్రమోషన్స్ లోనే బ్రేక్ గురించి మాట్లాడింది సామ్. ఫ్యామిలీ లైఫ్ కు ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి, ఓ రెండేళ్ల తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి కంప్లీట్ హోం మేకర్ గా మారిపోతుందట సామ్. అయితే 2023 తర్వాత సమంత, కొన్నాళ్ల తర్వాత వెండితెరపై కనిపించకపోవచ్చు. ఈ వార్త సామ్ అభిమానులను కొంచెం నిరాశపరిచే విషయమే. 

 

మొత్తానికి సమంత నోట హోం మేకర్ మాట వచ్చేసింది. రెండేళ్ల పాటు సినిమాలు చేసి తర్వాత కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పకనే చెప్పేసింది. దీన్ని బట్టి అర్థమవుతోంది ఆమె ఎంత ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తోందో. ఈ నిర్ణయం మాత్రం ఆమె ఫ్యాన్స్ ను మాత్రం కొంత నిరాశకు గురి చేసిందనే చెప్పొచ్చు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: