తెలుగు ఇండస్ట్రీలో మాటల రచయితగా ప్రస్థానం మొదలు పెట్టిన కొరటాల శివ తర్వాత ప్రభాస్ హీరోగా ‘మిర్చి’ చిత్రానికి దర్శకత్వం వహించారు.  ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడం మాత్రమే కాదు.. ఫ్యాక్షనీజానికి కొత్త భాష్యం చెప్పారు.  ఆ తర్వాత కొరటాల దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.   ఈ మూవీలో గ్రామాలను దత్తత తీసుకొని బాగు పరిస్తే గ్రామీణాభివృద్ది జరుగుతుందని..  ఊరి నుంచి ఎంతో తీసుకుంటాం.. ఊరికి కాస్తైనా ఇస్తే బాగుంటుందన్న మెసేజ్ ఓరియెంటెడ్ తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.  ఆ తర్వతా ఎన్టీఆర్, మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో జనతా గ్యారేజ్ తెరకెక్కించారు.   

 

ఈ మూవీలో అన్యాయం జరిగితే వారికి అండగా ఉండాలని.. ప్రపంచానికి మొక్కలు, పర్యావరణం ఎంతో అవసరం అని చాటి చెప్పే విధంగా మంచి మార్కులు కొట్టేసింది.  ఇలా వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న కొరటాల ఆ మద్య మహేష్ బాబు తో ‘భరత్ అనే నేను’ మూవీతో మరో సంచలన విజయం అందుకున్నాడు.  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఓ చిత్రం తీస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు మిర్చి లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ప్రేక్షకులకు కనువిందు చేసిన కాంబినేషన్ మరోసారి రిపీట్ అవబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

 

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాధాకృష్ణ దర్శకత్వంలో చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ఓ డియర్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేయాలని చిత్రబృందం భావిస్తోందట. అలాగే ‘రాధే శ్యామ్‌’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారని టాక్‌. ఈ మూవీ తర్వాత కొరటాలతో తీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి..అయితే దీనిపై అఫిషియల్ గా ప్రకటన రాలేదు.  ఒకవేళ ఇదే గనక నిజమే అయితే తమ అభిమాన హీరోకి మరో బ్లాక్ బస్టర్ ఖాయం అని అనుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: