ఈ మద్య తెలుగు ఇంస్ట్రీలో బాలీవుడ్ తారల సందడి ఎక్కువైంది. గత ఏడాది సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహెూ’ చిత్రంలో ఎక్కువగా బాలీవుడ్ నటులే ఎక్కువగా కనిపించారు. అయితే ఈ మూవీ పాన్ ఇండియా మూవీ కావడంతో వివిధ భాషల నటులను తీసుకున్నారు. మళియాళ, కన్నడ, హిందీ భాషల నటులు సాహెూ లో నటించారు. దాంతో ఈ చిత్రం ఎక్కువగా బాలీవుడ్ ఫ్లేవర్ ఉందని కామెంట్స్ వినిపించాయి.  ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయిన సాహెూ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.  ఇక తెలుగు లో ఎక్కువగా బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకున్న విలన్లే ఎక్కువగా కనిపిస్తున్నారని ఎన్ని కామెంట్స్ వినిపించినా.. దర్శక, నిర్మాతలు మాత్రం వారికే ఎక్కువ ఛాన్సులు ఇస్తున్నారు.  

 

ఇక టాలీవుడ్ లో కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఆ తర్వాత అంచలంచెలుగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.  రాజమౌళి దర్శకత్వంలో చత్రపతి చిత్రంతో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు.  బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో ఏకంగా జాతీయ స్థాయిలో రికార్డు మోత మోగించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్. కోసం 'రాధే శ్యామ్' .. 'ఓ డియర్' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో కృష్ణంరాజు ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక 'మైనే ప్యార్ కియా' ఫేమ్ భాగ్యశ్రీ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది.  

 

తాజాగా ఈ చిత్రం గురించి మరో సెన్సేషన్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి ఓ కీలక పాత్రలో తీసుకున్నట్లు సమాచారం. విలన్ పాత్ర అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.  గతంలో వెంకటేష్, పవన్ కళ్యాన్ నటించిన గోపాల గోపాల మూవీలో మిథున్ చక్రవర్తి విలన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: