తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది బాలీవుడ్ భామలు మెరిసారు.. కొంతమంది చాలా కాలం పాటు కెరీర్ కొనసాగిస్తే.. మరికొంత మంది మెరుపులా మెరిపి పోయారు.  ఝుమ్మందినాథం మూవీతో తన అందాల ఆరబోతతో కుర్రాళ్ల మనసు దోచిన నటి తాప్సీ పొన్ను.. తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయింది.  తెలుగు, తమిళ భాషల్లో తాప్సీ పలు సినిమాల్లో నటించింది.  ఇటీవల బాలీవుడ్ లో పింక్ సినిమాతో ఈ అమ్మడి అదృష్టం పూర్తిగా మారిపోయింది. వరుసగా బాలీవుడ్ లో విజయాలు అందుకుంటుంది. సినిమాల్లోనే కాదు తాప్సీ సోషల్ మాద్యమాల్లో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది.  

 

తాజాగా ఓ నెటిజన్ తాప్సీకి వెసిన ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబు చెప్పింది.  అసలు విషయానికి వస్తే.. ఈ రోజు ఢిల్లీలో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ తాప్సీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. తాను ఒక సెలబ్రెటీ కనుక అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే సదుద్దేశంతో తన ఫోటో షేర్ చేసింది. అయితే దీనికి కౌంటర్ గా ఓ నెటిజన్ ముంబయిలో నివాసం ఉంటున్న మీరెందుకు మా భవితవ్యాన్ని నిర్ణయిస్తున్నారు? తాప్సీ చాలా కాలం నుంచి ముంబయిలోనే ఉంటున్నప్పటికీ ఆమె తన ఓటును ఎందుకు అక్కడికి మార్చుకోలేదు.

 

ఆమె తన ఓటును ముంబయికి బదిలీ చేసుకోవాలి అన్నారు. దానికి వెంటనే తాప్సీ సమాధానం చెబుతూ.. తన పౌరసత్వం గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు. తాను ముంబయి కంటే దిల్లీలోనే ఎక్కువగా ఉంటున్నట్టు స్పష్టంచేశారు.  అంతే కాదు తన ఆదాయపు పన్ను కూడా దిల్లీలోనే చెల్లిస్తున్నట్టు చెప్పిన నటి..  దయచేసి నా పౌరసత్వం గురించి ప్రశ్నించొద్దు. ఒక అమ్మాయి దిల్లీ నుంచి బయటకు రావొచ్చు.. కానీ దిల్లీతో ఆ అమ్మాయి అనుబంధం విడదీయలేం.  నాకు ఏం చేయాలో.. ఏ చేయొద్దో తెలుసు.. మీరు చెబితే వినే పరిస్థితిలో నేను లేను అని గట్టిగానే బుద్ది చెప్పింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: