అందం చందం కలగలిపిన యాంకర్ అనసూయ.. ఓవైపు బుల్లితెర పై తనదైన సత్తా చాటుతూ వరుస కార్యక్రమాలలో మెరుస్తూనే మరోవైపు వెండితెరపై కూడా ఎన్నో అవకాశాలను తెచ్చుకుని తన సత్తా చాటుతోంది. ఇప్పటికే జబర్దస్త్ యాంకర్ గా తన వాక్చాతుర్యంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అనసూయ.. మొన్నటికి మొన్న జీ తెలుగు లో ప్రసారమయ్యే లోకల్ గ్యాంగ్స్ లో కూడా జడ్జి గా అవతారమెత్తింది. జీ తెలుగులో అయితే తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొడుతున్నది. మరికొన్ని రోజుల్లో ప్రతి రోజు పండుగ అనే మరో కొత్త ప్రోగ్రాం కూడా చేయబోతుంది. అంతే కాకుండా అటు వెండి తెరపై కూడా ఎన్నో అవకాశాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోంది. ఓవైపు ప్రత్యేక గీతాలు చేస్తూనే మరోవైపు వైవిధ్యత్మక పాత్రల్లో కూడా నటిస్తోంది. ముఖ్యంగా వెండితెర ప్రేక్షకులందరికీ అనసూయ రంగమ్మత్త గా మారిపోయింది.
రంగస్థలం సినిమాలో అనసూయ చేసిన రంగమ్మత్త పాత్ర ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. అయితే సెలబ్రిటీలు అన్నాక సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీల ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుంటారు పలువురు. తాజాగా అనసూయకు కూడా ఇలాంటి ఇబ్బంది ఎదురైంది. తాజాగా అనసూయకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది . దీనికి సంబంధించి తాజాగా స్పందించింది అనసూయ.
తనకు సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ చేసిన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.దీనికి సంబంధించిన అసలైన ఫోటోలు పోస్ట్ చేసిన అనసూయ... ఇదే అసలైన చిత్రమని ఈ ఫోటో ఎక్కడ కనిపించినా దయచేసి తనకు తెలియజేయాలి అంటూ విజ్ఞప్తి చేసింది అనసూయ. ఇదిలా ఉంటే అనసూయ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ... ఎవరైనా తనపై కామెంట్ చేస్తే వారికి ఘాటుగా బదులిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఫోటో మార్ఫింగ్ చేశారు అంటూ రంగమ్మత్త సోషల్ మీడియా వేదికగా ఆరోపించింది.