చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ గా తనదైన నటన డాన్సులతో ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్నాడు రామ్ చరణ్. ఓ వైపు  వరుస సినిమాలు చేస్తూనే...  మరోవైపు నిర్మాతగా కూడా బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు అయితే తన తండ్రి చిరంజీవి నటించిన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు రామ్ చరణ్. చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా సందర్భంగా కొణిదెల ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను నిర్మాతగా కూడా అవతారమెత్తాడు. చిరంజీవి చేస్తున్న ప్రతి సినిమాను  రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. 

 


ప్రస్తుతం  దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నటిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు తన తండ్రి మెగాస్టార్ నటిస్తున్న సినిమా నిర్మాణ బాధ్యతలను కూడా చూసుకుంటున్నాడు. తాజాగా నిర్మాత గా బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని రామ్ చరణ్ భావిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ లో ఓ సినిమా నిర్మించే యోచనలో రామ్ చరణ్ వున్నారట. రణవీర్ సింగ్ హీరోగా ఒక సినిమాను నిర్మించాలని రామ్ చరణ్ భావిస్తున్నారట. దీనికి సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

 


 అయితే ఇప్పటికే ఓ సారి రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అపూర్వ లిఖియా డైరెక్షన్లో జంజీర్ సినిమా చేస్తాడు రామ్ చరణ్. ఆ సినిమా తెలుగులో  తుఫాన్ గా వచ్చింది. ఈ సినిమా అటు హిందీతో పాటు ఇటు తెలుగులో కూడా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఒకప్పుడు హీరోగా బాలీవుడ్ లో తన లక్ ను పరీక్షించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు నిర్మాతగా మరోసారి బాలీవుడ్ లో తన లక్కు  పరీక్షించుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే త్వరలో రన్వీర్ సింగ్ హీరోగా ఓ సినిమా రామ్ చరణ్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే..  మరిన్ని  సినిమాలు కూడా రామ్ చరణ్ నిర్మించే అవకాశం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: