ట్రెండ్ మారింది మచ్చ అంటున్నారు యువత.. ఒకప్పుడు స్నేహితులనే ఆత్మీయులనో కలుసుకోవాలనుకున్నప్పుడు చిరునవ్వుతో పాటుగా ఒక ఆలింగనం కూడా చేసుకొనే వారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. హగ్ కాస్త ముద్దు వరకు వెళ్ళింది.ఇప్పుడు బుగ్గలు కొరికే వరకు వెళ్ళింది.

 

 

కొత్తగా ఉన్నా .. దాన్ని ట్రేండింగ్ అంటూ నానా రచ్చ చేస్తున్నారు. ఈ ట్రేండింగ్ గోలలో పడి కొందరు నవ్వులపాలు అవుతున్న సంఘటనలు కోకొల్లలు. ఇక టిక్ టాక్ పుణ్యమా అని కొత్త రచ్చ చేస్తున్నారు. మొన్న ఆమధ్య ఓ టీవీ షో లో ఓ లేడి యాంకర్ ఓ వ్యక్తి బుగ్గను కొరికింది. షో ద్వారా ఫెమస్ అవడానికి కొత్తగా ఆకట్టుకోవడానికి ఇలా ప్రయోగాలు చేస్తున్నారు.  ఇక జనాలతో ఇంటరాక్ట్ అయ్యే షో లో అయితే మరి దారుణం .. ఈ మద్యే యాంకర్ వర్షిణి .. యాంకర్ గా చేస్తున్న పటాస్ షో లో ఓ ప్రశ్నకు జవాబు ఇచ్చిన అభిమానిని పిలిచి మరి బుగ్గ కొరికింది వర్షిణి.

 

ఆ దెబ్బకు అక్కడున్న అందరు షాక్ అయ్యారు ..దెబ్బకు షో లో ఉన్నవాళ్ళంతా కూడా నోర్లు వెళ్ళబెట్టారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆ షో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈటివి లో ప్రసారం అవుతున్న ఢీ ప్రోగ్రాంలో సుడిగాలి సుధీర్, రష్మీ టీమ్ ల మధ్య గట్టి పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు యాంకర్స్ టీమ్ పోటా పోటీగా సత్తా చాటుతున్నారు. ఇక జడ్జెస్ గా హీరోయిన్స్ పూర్ణ, ప్రియమణి, శేఖర్ మాస్టర్ లు వ్యవహరిస్తున్నారు.

 

 

తాజాగా ఢీ షో లో ఒక కంటెస్టెంట్ డాన్స్ చేసి అదరగొట్టాడు .. వెంటనే అతనిని పిలిచి బుగ్గ కొరికింది పూర్ణ.ఇంత దురద పెట్టిందా అతని బుగ్గను కొరికావు అంటూ చాలా మంది కామెంట్లు పెట్టారు. గతంలో వర్షిణి చేసిన పనికే అందరు సిగ్గుతో తల దించుకున్నారు చాలా మంది.. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు పూర్ణ చేయడంతో సోషల్ మీడియాలో దుమారం లేపుతుంది.. ఇంకా ముందు ఎన్ని వస్తాయో అని అందరు మండిపడుతున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: