బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్- ఆలియాభట్ ల ఇంట్రెస్టింగ్ లవ్ స్టో బాలీవుడ్ తో పాటు అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.  దాంతో ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్న ఆలియా  లవ్ స్టోరీ విషయంలో మెగా ఫ్యాన్స్- నందమూరి ఫ్యాన్స్ లోనూ ఆసక్తి నెలకొంది. 2020 మోస్ట్ అవైటెడ్ మూవీగా చెబుతున్న 'బ్రహ్మాస్త్ర' లో ఈ కపుల్ నటిస్తుండటంతో ఇద్దరు కలిసి ఎక్కడ పడితే అక్కడ తిరగడం ఎక్కడికెళ్ళినా కలిసే వెళుతుండడంతో మీడియాకి దొరికి రచ్చ రంబోలా అయింది. ఇక ఈ ఇద్దరు ఒక్కరోజు కూడా ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంత స్ట్రాంగ్ బాండింగ్ ఉందన్న ప్రచారం కూడా వేడెక్కిస్తుంది. వీళ్ళ వ్యవహారం పెళ్ళి వరకూ వెళుతుందా లేదా తెలీదు గాని ఇప్పుడైతే అందరి కళ్ళు వీళ్ళ మీదే.  

 

ఇక ఎప్పటి నుంచో రణబీర్-ఆలియా కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. వారసుల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం.. అటుపై కలిసి లంచ్ లు.. డిన్నర్లు కానిచ్చేసారు. దాంతో ఎవరికి తెలీకుండా ఏ హంగు ఆర్భాటము లేకుండా సైలెంట్ గా ఎంగేజ్ మెంట్ కూడా కానిచ్చేశారన్న ప్రచారం బాలీవుడ్ లో ఉంది. బ్రహ్మస్త్ర రిలీజ్ అయిన తర్వాత పెళ్లి బంధంతో ఆ ఇద్దరూ ఒకటి కాబోతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ టాప్ సీక్రెట్ ని రివీల్ చేసారు. డిసెంబర్ లో బ్రహ్మస్త్ర రిలీజ్ అయిన వెంటనే రణబీర్-ఆలియా పెళ్లి పీఠలెక్కనున్నార బాలీవుడ్ మీడియా లేటెస్ట్ న్యూస్.

 

వీరిద్దరి వివాహానికి శుభ ముహూర్తం నిర్ణయించేందుకు ఇరు కుటుంబాలు సిద్ధమయ్యారని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు..సన్నిహితులు..స్నేహితులకు కూడా ఈ విషయాన్ని చెప్పారట. ఈ రకంగా చూస్తే డిసెంబర్ నాటికి ఎవరు ఎక్కడున్నా బంధు మిత్రులు అంతా ముంబై లో వాలి పోవాలని ముందుగానే సంకేతాలు పంపడం అన్నమాట. ఇరు కుటుంబాలు సినీ నేపథ్యం గలవే కాబట్టి పెళ్లి పిలుపుల శ్రమ.. అనవసర ఖర్చు ఇప్పటికి తగ్గించుకుంటునట్ట్లు తెలుస్తోంది. అయితే పెళ్లిని మాత్రం అంగరంగ వైభవంగా చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయట. ఇక 'బ్రహ్మాస్త్ర' బాలీవుడ్ లో సంచనాలు సృష్ఠించడానికి సిద్దమవుతున్నట్లు ఇప్పటికే అర్థమైపోయింది. ఈ సినిమాలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: