టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉన్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన ఈ సినిమా అనిల్ రావిపూడి కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి పోయింది. ఇదే తరుణం సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతూ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు. దీంతో మొన్నటి వరకు ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో సినిమా యూనిట్ చాలా చురుగ్గా పాల్గొనడం జరిగింది. ఇటీవల 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకి సంబంధించి మొత్తం సక్సెస్ సంబరాలు క్లోజ్ అయిపోయాయి. ఇటువంటి తరుణంలో ఎవరికి వారు మహేష్ బాబు ఫ్యామిలీతో అమెరికాలో ఎంజాయ్ చేస్తుండగా మరో పక్క అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమా కోసం  'ఎఫ్3' స్క్రిప్టు రెడీ చేస్తున్నాడు.

 

ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే వరుణ్ తేజ్ లతో 'ఎఫ్2' సినిమాను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్న అనీల్.. ఈ సారి ముగ్గురు హీరోలతో సినిమా చేస్తాను అని అనౌన్స్ చేసాడు. వెంకటేష్, వరుణ్, రవితేజాలతో సినిమా చేయాలని మొదట్లో అనుకున్నాడు అనీల్.. కానీ ఇప్పుడు మహేష్ బాబు పేరు వినిపిస్తుంది.

 

రవితేజ ప్లేస్ లో మహేష్ నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా ఈ వార్త బయటకు రాలేదు గానీ ఫిలింనగర్లో మాత్రం గట్టిగా వినబడుతుంది. పూర్తి కామెడీ నేపథ్యంలో తెరకెక్కే క్యారెక్టర్ కావడంతో మహేష్ అనిల్ రావిపూడి చెప్పినా క్యారెక్టర్ రోల్ కి ఫిదా అయినట్లు దీంతో మహేష్ చేసే అవకాశం ఎక్కువ ఉన్నట్లు చాలా కొద్దిపాటి క్యారెక్టర్ కావడంతో ఓకే చేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: