త్రివిక్రమ్ డైరక్షన్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్, హారిక హాసిని బ్యానర్ రాధాకృష్ణ కలిసి నిర్మించిన మూవీ అల వైకుంఠపురములో. పూజా హెగ్దే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో టబు, సుశాంత్, నివేదా పేతురాజ్  వంటి స్టార్స్ నటించారు. నాన్ బాహుబలి రికార్డులను తిరగ రాసిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. 

 

సినిమా హిట్ రేంజ్ చుసిన బాలీవుడ్ నిర్మాతలు సినిమాను అక్కడ రీమేక్ చేయాలని అనుకుంటున్నారు. అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసిన అశ్విన్, అల వైకుంఠపురములో హిందీ రైట్స్ కొన్నారట. 8 కోట్ల భారీ మొత్తం ఇచ్చి మరి ఈ సినిమా హక్కులు తీసుకున్నారట. అయితే అల వైకుంఠపురములో హిందీలో డైరెక్ట్ చేసే దర్శకుడి వేటలో ఉన్నారట. 

 

ముంబై మీడియా సమాచారం ప్రకారం అల వైకుంఠపురములో సినిమాను కూడా అర్జున్ రెడ్డి డైరక్టర్ చేతిలో పెట్టే ఆలోచనలో ఉన్నారట హిందీ నిర్మాత అశ్విన్. అయితే అర్జున్ రెడ్డికి అల వైకుంఠపురములో సినిమాకు చాలా తేడా ఉంది. ఈ సినిమా గురూజి డైలాగ్స్ మీద నడిపించాడు. స్క్రీన్ ప్లే కూడా ఎలాంటి హడావిడి లేకుండా వెళ్తుంది. మరి అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ మూవీ చేసిన సందీప్ వంగ అల సినిమాని తీస్తాడో లేదో చూడాలి. ఈ రీమేక్ లో కూడా షాయిద్ కపూర్ ను హీరోగా ఎంచుకునే అవకాశాలు ఉన్నాయట. ప్రస్తుతం అతను జెర్సీ రీమేక్ లో నటిస్తున్నాడు. మరి అర్జున్ రెడ్డి డైరక్టర్ చేతిలోనే హిందీ అల వైకుంఠపురములో సినిమా ఉందా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. అయితే సందీప్ వంగ మళ్లీ రౌడీ హీరో విజయ్ దేవరకొండతోనే మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు మహేష్, చరణ్ లకు కూడా కథలు చెప్పి వారి రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: