అక్కినేని ఫామిలీలో యంగ్ హీరోల్లో ఒక్క నాగ చైతన్య తప్ప మరెవరూ హీరోగా సక్సస్ కాలేదు. చైతూ తమ్ముడు అఖిల్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటివరకూ మూడు సినిమాలలో నటించాడు. అయితే వాటిలో ఒక్కసినిమా కూడా అఖిల్ కు మంచి హిట్ ని అందించలేకపోయింది. అయినా హీరోగా నిలబెట్టడానికి నాగార్జున విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అఖిల్ తాజాగా రూపొందుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. జీఎ2 పిక్చర్స్.. యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆరెంజ్ డిజాస్టర్ తర్వాత భాస్కర్ మళ్ళీ ఇదే రావడం. ఇక ఈ సినిమా ప్రొడక్షన్ లో ఉండగానే అఖిల్ కు మరో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసేందుకు అక్కినేని నాగార్జున రెడీ అవుతున్నారట.

 

కమర్షియల్ సినిమాలను రూపొందించడంలో స్పెషలిస్టు అయిన అనిల్ రావిపూడి ఈమధ్యే మహేష్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కలెక్షన్స్ అటు మహేష్ బాబు కెరీర్లోనూ.. అనిల్ రావిపూడి కెరీర్లోనూ హయ్యెస్ట్ గా నిలవడం విశేషం. అయితే ఇందులో అంత వాస్తవం లేదన్న మాటా వినిపిస్తుంది. స్టార్ హీరోలందరూ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత అనిల్ నెక్స్ట్ సినిమాకు స్టార్లు ఎవరూ అందుబాటులో లేరు. దీంతో 'ఎఫ్ 3' సినిమాను ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. అయితే వరుణ్ తేజ్.. వెంకటేష్ ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు కాబట్టి వెంటనే స్టార్ట్ చేసే అవకాశం తక్కువ. ఇదే అవకాశం అనుకొని అనిల్ రావిపూడికి అఖిల్ తో నెక్స్ట్ సినిమా చేసేందుకు అక్కినేని నాగార్జున బంపర్ ఆఫర్ ఇచ్చారని తాజా సమాచారం.

 

అనిల్ ఈ ఆఫర్ ను ఒప్పుకుంటే సినిమా పట్టాలెక్కెందుకు అన్నీ చక చక జరిగిపోతాయని అంటున్నారు. అనిల్ రావిపూడి తన సినిమాలను టైట్ షెడ్యూల్స్ లో పూర్తి చేస్తారు కాబట్టి ప్రాజెక్ట్ ఓకే అయితే మాత్రం నాన్ స్టాప్ గా ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయోచ్చు. దీనిపై త్వరలోనే మేకర్స్ నుంచి అఫీషియల్ గా న్యూస్ రావచ్చు. అయితే అక్కినేని ఫ్యాన్స్ మాత్రం అసలు ఓద్దంటూ నాగార్జునకి సలహాలిస్తున్నారట. సరిలేరు అంత భారీ హిట్ కాలేదని అందుకు అనిల్ రొటీన్ ఫార్ములానే అని అంటున్నారు. అఖిల్ కి ఇప్పటి వరకు మంచి హిట్ లేదు కాబట్టి అనిల్ కి ఛాన్స్ ఇవ్వద్దంటూ చెబుతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: