సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీసినిమా రిలీజ్ కి  ముందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమాకి ఓకే చెప్పింది. బ్యాక్ టు బ్యాక్ రెండు స్టార్ హీరోల సినిమాలను చేసిన కియారా అద్వానీ ఒక సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకుంటే ఒక సినిమాతో డిజాస్టర్ ని చూసి అల్లాడిపోయింది. దాంతో మళ్లీ తెలుగు సినిమాల వైపు అంటే టాలీవుడ్ కి రానే లేదు. వినయ విధేయ రామ ఘోర పరాజయం అవడంతో కియారాకి తెలుగు సినిమాల్లో నటించాలంటేనే భయం తో హడలిపోతుందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందబోతున్న తాజా చిత్రంలో కియారా అద్వానీని హీరోయిన్ గా నటింపజేయాలని మేకర్స్ చాలా ప్రయత్నాలు చేశారు. వదలకుండా ఫోన్ కాల్స్ కూడా చేశారట. కానీ కియారా మాత్రం చూద్దాం చెప్తా అంటూ నెమ్మదిగా నో చెప్పిందని అన్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా కోసం క్రిష్ కియారాని సంప్రదించాడట. ఈసారి కూడా కియారా అద్వానీ నుండి నో అనే సమాధానం వచ్చింది. దాంతో క్రిష్ ప్రస్తుతం వేరే హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డాడు. అయితే గత నాలుగైదు రోజులుగా పవన్ సరసన కియారా నటిస్తుందని రక రకాల రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు నో అన్నదన్న రూమర్ వచ్చింది. మరి ఈ రూమర్స్ లో ఏది నిజమో ఇంకా క్లియర్ గా తెలీలేదు.

 

మెగా హీరోలు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కి నో చెప్పడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా మూవీ వినయ విధేయ రామ ప్రభావం కారణంగానే వరుణ్, పవన్ లతో నటించేందుకు కియారా భయపడుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు హిందీ అర్జున్ రెడ్డిలో నటించిన తర్వాత కియారాకి రేంజ్ ఓ రేంజ్ లో పెరిగింది. అది కూడా ఒక కారణం.

 

ప్రస్తుతం అక్కడ చాలా బిజీగా ఉండటం వల్ల పవన్ కు డేట్లు ఇవ్వలేక పోయిందని మరికొందరు అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమాకు కియారా అద్వానీ నో అయితే చెప్పిందన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కియారా ఇలా నో చెప్పడం చూస్తే అసలు ఆ హీరోలంటే నే చమటలు పట్టి ఒళ్ళంతా కారిపోతున్నాయన్నయట. పొరపాటున ఇక్క మరో సినిమాతో గనక ఫ్లాప్ పడితే బ్యాడ్ హీరోయిన్ అన్న ట్యాగ్ తగిలిస్తారని అలా అనిపించుకోవడం ఇష్టం లేకనే కియారా తప్పని పరిస్థితుల్లో ఇలా నో అంటుందట పాపం. 

మరింత సమాచారం తెలుసుకోండి: