టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి తొలుత యావరేజ్ టాక్ ని సంపాదించినప్పటికీ, సూపర్ స్టార్ మహేష్ చాలా రోజుల తరువాత మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మూవీ లో నటించడంతో పాటు వరుసగా సంక్రాంతి సెలవలు రావడం కూడా సరిలేరు సినిమాకు బాగా కలెక్షన్ రావడానికి దోహద పడింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్

 

ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ సినిమాలో మహేష్, మేజర్ అజయ్ కృష్ణ అనే మిలిటరీ మేజర్ పాత్రలో నటించగా, సంస్కృతి అనే అల్లరి అమ్మాయి పాత్రలో రష్మిక మందన్న మంచి నటనను కనబరిచింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, ప్రొఫెసర్ భారతి అనే అనే పాత్రలో నటించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇకపోతే ఇటీవల బాగా కలెక్షన్స్ రాబట్టి మంచి విజయాన్ని ఈ సినిమా అందుకోవడంతో సూపర్ స్టార్ సహా ఆ సినిమా యూనిట్ మొత్తం కూడా ఎంతో ఆనందంతో సక్సెస్ మీట్ ని వరంగల్ జిల్లా హన్మకొండ లో ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. 

 

ఇక దాని అనంతరం మహేష్ బాబు, తన ఫ్యామిలీ తో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్లారు. అయితే కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, మరొక నెలరోజుల తరువాత మహేష్ బాబు ఇండియాకు తిరిగి వస్తారని, ఆయన రాగానే ఈ సినిమా 50 డేస్ ఫంక్షన్ ని ఎంతో గ్రాండ్ లెవెల్లో పలువురు సినిమా ప్రముఖులతో పాటు సినిమాకు సంబందించిన డిస్ట్రిబ్యూటర్లతో పాటు మీడియా పర్సన్స్ ని కూడా పిలిచి ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్వహించాలని సినిమా యూనిట్ గట్టిగా ప్లాన్ చేస్తోందట. ఒక టాలీవుడ్ స్టార్ హీరో ప్రత్యేక అతిథిగా హాజరుకానున్న ఈ వేడుక విజయవాడలో జరిగే అవకాశం ఉందట. మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఓపిక పట్టాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: