టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రెండేళ్ల క్రితం వచ్చిన అజ్ఞాతవాసి సినిమా ఘోర పరాజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. పవన్ కెరీర్ 25వ సినిమాగా వచ్చిన ఆ  సినిమా తరువాత అయన పూర్తిగా సినిమాల నుండి విరామం తీసుకుని రాజకీయాల్లో బిజీ అయి, ఇటీవల ఆంధ్రకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసారు. ఇక ప్రస్తుతం కూడా ఓ వైపు రాజకీయాల్లో బిజీ గా ఉంటున్న పవన్, మరోవైపు ఫ్యాన్స్ యొక్క కోరిక మేరకు సినిమాల్లో కూడా కొనసాగాలని నిర్ణయించారు. ఇక ప్రస్తుతం ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి హిట్ కొట్టిన పింక్ సినిమా తెలుగు రీమేక్లో నటిస్తున్న పవన్

 

దాని తరువాత అతి త్వరలో క్రిష్ జాగర్లమూడి తీయనున్న సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ఆపై హరీష్ శంకర్ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలోని సినిమాలో నటించనున్న పవన్, ఒక్కసారిగా ఫ్యాన్స్ కు మూడు సినిమాలు ప్రకటించి మంచి ఖుషి న్యూస్ చెప్పారు. అయితే ముందుగా ఆయన నటిస్తున్న పింక్ తెలుగు రీమేక్ సినిమా, మే నెల మధ్యలో రిలీజ్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఇక క్రిష్ తో చేయబోయే సినిమా దీపావళికి, అలానే హరీష్ శంకర్ తో చేయబోయే సినిమా వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం. 

 

అయితే పింక్ రీమేక్ తో పాటు, క్రిష్ తో పవన్ చేయనున్న రెండు సినిమాలు కూడా కొంత సామజిక అంశాలతో కూడుకున్న కథలు అని సమాచారం. కాగా వాటిపై పవన్ ఫ్యాన్స్ కు కొంత నమ్మకం ఉన్నప్పటికీ, వారికి భారీ స్థాయిలో అంచనాలు మాత్రం హరీష్ శంకర్ సినిమాపైనే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో పవన్, హరీష్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంతో పెద్ద విజయాన్ని అందుకున్నందున, ఈ సారి వారిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా కూడా తప్పకుండా మంచి హిట్ కొట్టి, పవన్ కు కెరీర్ పరంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని వారు భావిస్తున్నారు. మరి వారి ఆశలను హరీష్ ఎంతవరకు నెరవేరుస్తారో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: