ఎప్పటి నుంచో నందమూరి ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఎదురు చూసేది ఏంటంటే... వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక్కటైనా మల్టీస్టారర్ చూడాలని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. బాబాయ్ అబ్బాయిలతో తెరమీద కనపడితే ఆ సందడే వేరంటున్నారు అందరూ అయితే ఆ ముహూర్తం ఎప్పుడెప్పుడు వస్తుందా ఆ చిత్రాన్ని ఏ దర్శకుడు తీస్తాడా.. ఆ కథ ఎలా ఉండబోతుంది. ఇలా రక రకాల ప్రశ్నలతో ఎప్పుడూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న వారందరికీ షాక్ ఇచ్చిడు మన జూనియర్ ఎన్టీఆర్. అదేంటి అనుకుంటున్నారా... అవునండి ఇది నిజం... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ మల్టీస్టారర్ తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
అయితే దీని కోసం ఓ మంచ కథను రెఢీ చేసుకుని బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్లతో కలిసి చేయాలనుకున్నాడని సినీ వర్గాల టాక్. ఇక దాని కోసం ఇటీవలె ఈ ప్రతిపాదననను ఎన్టీఆర్ ముందర పెట్టగా దానికి ససేమిరా నో చెప్పినట్టు టాక్. బాబాయ్తో కలిసి నేను సినిమా చేయలేనంటూ ఆ డైరెక్టర్కి ఎన్టీఆర్ నిర్మొహమాటంగా తేల్చి చేప్పేశాడట. అయితే దీనికోసం త్రివిక్రమ్ కాస్త చొరవ తీసుకుని ఎన్టీఆర్ ఒప్పుకునేటట్టు అడిగినప్పటికీ ఎన్టీఆర్కు మాత్రం ఏమాత్రం చేయడం ఇష్టం లేదన్నట్టుగా టాక్ వినిపిస్తోంది.
మరి ఇదిలా ఉంటే... ఎప్పటి నుంచో ఈ కాంబినేషన్ని చూడాలనుకునే ఫ్యాన్స్ కోసమైన ఒప్పుకుంటే బావుంటుందని కొందరు భావిస్తుంటే... మరికొందరు బాలకృష్ణతో ఎన్టీఆర్ నటించడానికి ఇష్టపడకపోవడం ఏమిటి అది ఆయన మీద ఉన్న గౌరవంతోనా లేక మరేదన్నా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో అందరూ ఆలోచిస్తున్నారు. అయితే గతంలో వీరిద్దరి మధ్య పెద్దగా మాటలు లేకపోయినప్పటికీ. ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ మరణానంతరం బాలయ్యలో కొంత మార్పు వచ్చిందని ఇప్పుడు వీరిద్దరి మధ్య సత్ససంబంధాలు బాగానే ఉన్నట్టు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ కాంబినేషన్ చూడాలనుకునే ఫ్యాన్స్కి ఇది ఒక చేదు వార్తలాంటిదే మరి.