టాలీవుడ్లో ఉన్న సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం కాస్త కష్టంగా మారింది ప్రస్తుతం. అందులోనూ బాలకృష్ణకి అది మరింత కష్టంగా మారింది. బాలయ్య నటించే గత మూడు చిత్రాల నుంచి హీరోయిన్ దొరక్క ఆయన కష్టాలు మాములుగా లేవు. ఇక ఎవరూ లేక పెట్టిన హీరోయిన్నే మళ్ళీ మళ్ళీ పెడుతున్నారు. సోనాల్ చౌహాన్ బాలయ్యతో కలిసి దాదాపు మూడు చిత్రాల్లో నటించింది. ఇక రీసెంట్గా విడుదలైన రూరల్ చిత్రంలో బాలయ్య పక్కన అవుట్డేటెడ్ హీరెయన్లను పెట్టారు. అందులో కూడా సోనాల్ చౌహాన్, వేదికలను హీరోయిన్లుగా తీసుకున్నారు. ఇక సోనాల్ బాయల్యతో కలిసి నటించిన మూడవ చిత్రమిది అని చెప్పవచ్చు.
సాధారణంగా బాలయ్యకు హీరోయిన్లు సెట్ కారు... ఇప్పుడు సేమ్ అలాంటి పరిస్థితే పవర్స్టార్ పవన్కళ్యాణ్కి వచ్చింది. ప్రస్తుతం పవన్ పింక్ రీమేక్ చిత్రీకరణలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో క్రిష్ దర్శకత్వంలో పవన్ తన 27 చిత్రం కూడా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పవన్ కాంబినేషన్లో వచ్చే సీన్స్ ను చక చకా పూర్తి చేసిన క్రిష్ ప్రస్తుతం పవన్ లేకుండానే చిత్రీకరణ చేస్తున్నాడట. హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. పవన్ 27 చిత్రంలో హీరోయిన్ విషయమై గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొంత మంది హీరోయిన్ల పేర్లు వినపడుతున్నాయి.
కానీ ఇప్పటివరకు సరైన క్లారిటీ మాత్రం రాలేదు. ఆమె ఈమె అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కియారా అద్వానీని ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరిగింది. అయితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కియారా ప్రస్తుతం బాలీవుడ్ లో చాలా బిజీగా ఉంది. ఆమె డేట్లు సంవత్సరం మొత్తం ఖాళీ లేవట. కాని పవన్కు అంత ఆగే సమయం లేదు ఒకేసారి నాలుగు సినిమాలతో పవన్ ఫ్యాన్స్కి షాక్ ఇచ్చే పనిలో పడ్డారు. దాదాపు రెండేళ్ళపాటు ఆయన గ్యాప్ తీసుకున్న తర్వాత రావడంతో ఆయన నాలుగు సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారు. దాంతో ఆహా కళ్యాణం ఫేం వాణి కపూర్ను ఈ చిత్రంకు ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది. మరి దీంతో బాలకృష్ణ ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఇప్పుడు అవే ఇబ్బందులు పవన్కి కూడా టాలీవుడ్లో కనపడుతున్నాయి.