గత కొంత కాలంగా పవన్ కమెడియన్ అలీ ల మధ్య గ్యాప్ ఏర్పడింది అన్నది ఓపెన్ సీక్రెట్. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్ పార్టీ తరుపున ప్రచారం చేసిన అలీ పవన్ ను టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ కూడా చేసాడు. దీనితో పవన్ అలీ ల మధ్య మైత్రి ఇక పూర్తిగా బ్రేక్ పడినట్లే అని అంతా భావించారు.


అయితే ఎవరు ఊహించని విధంగా పవన్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీలో అలీ కి ఒక పాత్రను క్రియేట్ చేయమని స్వయంగా పవన్ క్రిష్ కు చెప్పాడు అంటూ వార్తలు కూడ వచ్చాయి. ఈ వార్తల పై ఇంకా క్లారిటీ రాకుండానే అలీ లేటెస్ట్ గా విశాఖపట్నంలో జరిగిన ఒక ఫంక్షన్ లో చేసిన కామెంట్స్ పవన్ ను టార్గెట్ చేసేవిగా ఉన్నాయి అంటూ పవన్ అభిమానుల అభిప్రాయం.  


వైజాగ్ లో జరిగిన కార్యక్రమానికి అతిధిగా వచ్చిన అలీ కొద్దిసేపు సరదాగా మాట్లాడుతూ ‘లచ్చిమీ డోంట్ టచ్ మీ.. బాగున్నారా బాగున్నారా?’ అంటూ తెగ నవ్వించాడు. అయితే అక్కడతో ఆగకుండా తన ఉపన్యాసంలో మాట్లాడుతూ విశాఖ ప్రజలు తెలివైనోళ్లు అని ఎవరిని ఎక్కడ ఉంచాలో వారికి బాగా తెలుసంటూ అలీ చేసిన వ్యాఖ్యలు పవన్ ను ఉద్దేశించి చేసినవే అంటూ పవన్ అభిమానుల భావన. 


గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పవన్ విశాఖపట్నం దగ్గర గాజువాక స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. వాస్తవానికి పవన్ అభిమానులు ఎక్కువగా ఉన్న గాజువాక ప్రాంతం పై పవన్ కు విపరీతమైన నమ్మకం ఉంది. దీనితో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పవన్ గాజువాకలో పెద్దగా ప్రచారం కూడ చేయలేదు. అయితే గాజువాకలో పవన్ ఓటమి పవన్ అభిమానులు కూడ జీర్ణించుకాలేకపోయారు. దీనితో విశాఖపట్టణ ప్రజలు పవన్ కు చెక్ పెట్టారు అనే అర్ధం వచ్చేలా అలీ మాటలు  ఉన్నాయి అంటూ అలాంటి వ్యక్తితో పవన్ మళ్ళీ నటించడం ఏమిటి అంటూ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: