పవన్ క్రిష్ ల భారీ మూవీ ప్రాజెక్ట్ కు వాణీకపూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేయాలి అన్న ఆలోచనలు కొనసాగుతూ ఉన్నా ఈ మూవీకి ఒక క్రేజీ హీరోయిన్ ఉంటె బాగుంటుంది అన్న అభిప్రాయం క్రిష్ కు కలగడంతో కియారా అద్వాని పూజ హెగ్డే లతో క్రిష్ రాయబారాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కియారా అద్వాని పవన్ తో నటించే విషయంలో వచ్చిన ప్రపోజల్ ను సున్నితంగా తిరస్కరిస్తూ తన వద్ద డేట్స్ సద్దుబాటు చేసే విషయంలో సమస్యలు వస్తాయి అని చెప్పి తప్పించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఇక పూజ హెగ్డే మాత్రమే మిగిలి ఉండటంతో ప్రస్తుతం క్రిష్ ఈమెను ఈ మూవీ ప్రాజెక్ట్ లోకి ఎలాగో ఒకలా ఒప్పించాలి అన్న ప్రయత్నాలలో భాగంగా దర్శకుడు త్రివిక్రమ్ సహాయాన్ని కోరినట్లు టాక్. వాస్తవానికి పూజ హెగ్డే కూడ చాల బిజీగా ఉంటోంది. 


ఈమె డేట్స్ ను బట్టి ప్రభాస్ జిల్ రాథా కృష్ణల మూవీ ప్రాజెక్ట్ షెడ్యూల్స్ ను మారుస్తున్నారు అంటే పూజ మ్యానియా ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుంది. అయితే ఈమెకు త్రివిక్రమ్ అంటే ప్రత్యేకమైన గౌరవం. ‘అరవింద సమేత’ ‘అల వైకుంఠపురములో’ మూవీలలో పూజ హెగ్డే కు నటన పరంగా కూడ మంచి స్కోప్ ఉన్న పాత్రలను త్రివిక్రమ్ క్రియేట్ చేసాడు.


దీనితో ఈమెకు త్రివిక్రమ్ కు ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఆమె కోరుకున్న పారితోషికం ఇచ్చి పూజ మ్యానియాను కూడ పవన్ లేటెస్ట్ మూవీకి జత చేయాలని క్రిష్ ప్రయత్నిస్తున్నా ఆమె ఇప్పటివరకు క్రిష్ కు అందుబాటలోకి రావడం లేదని తెలుస్తోంది. అంతేకాదు క్రిష్ ఆమెకు కథ చెప్పాలని ప్రయత్నిస్తున్నా ఆ అవకాసం కూడ క్రిష్ కు ఇవ్వకుండా పరోక్షంగా పవన్ తో తనకు నటించే ఉద్దేశ్యం లేదు అన్న సంకేతాలు ఇస్తున్నట్లు టాక్. ఈ పరిస్థితులలో పూజ మనసు మార్చాలని త్రివిక్రమ్ చేస్తున్న ఆఖరి ప్రయత్నాలు ఎంత వరకు సక్సస్ అవుతాయో చూడాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: