తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా త్రిష హీరోయిన్ గా నటించిన చిత్రం 96. ఈ సినిమా తమిళంలో మంచి విజయాన్ని సాధించింది. లవ్ ఎమోషన్ తో కలగలిపిన కథాంశంతో సాగే ఈ సినిమా ఎంతో మంది ప్రేక్షకులను మనసును తాకింది. ఇక ఈ సినిమాను తెలుగులో జాను పేరుతో రీమేక్ చేసిన  విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి పాత్రలో శర్వానంద్ త్రిష  పాత్రలో సమంత ఈ సినిమాలో నటించారు. ఇక తాజాగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని విజయం సాధించింది. మంచి ఫీల్ గుడ్ మూవీగా విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. 

 


 అదిరిపోయే ఎమోషన్స్ ని పలికించడంలో శర్వానంద్ సమంత తన నటనతో అదరగొట్టారు అని చెప్పాలి. మరో సారి వీరిద్దరి నటనకు ప్రశంసలు కూడా అందుకున్నారు. శర్వానంద్ సమంత ఆయా పాత్రల్లో జీవించి మరి నటించి పాత్రలకు ప్రాణం పోసారు అనే చెప్పాలి. దీంతో జాను సినిమాలోని సమంత శర్వానంద్ పాత్రలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాయి. ప్రస్తుతం జాను సినిమా మంచి టాక్ తో దూసుకుపోతున్నది.  తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో శర్వానంద్ ఈ సినిమాకు సంబంధించి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు. 

 

 మొదట ఈ సినిమా చేయడానికి తాను ఆలోచించాను అని తెలిపారు శర్వానంద్.. అయితే ఈ సినిమాలో తనతో పాటు సమంత నటించడం వల్లే తాను కూడా ఆ స్థాయిలో నటించగలిగానని..సమంత  కాకుండా వేరే వాళ్ళు నటించి ఉంటే అంత బాగా నా పాత్రలో నటించే వాడిని కాదు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా విజయ్ సేతుపతి త్రిష నటన లను మరిపించేలా శర్వానంద్ సమంత నటన ఉంది అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు అని ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు 96 అంటే శర్వానంద్ సమంతనే గుర్తుకు వస్తున్నారు అంటూ  పలువురు చెబుతుంటే అదే మాకు పెద్ద సక్సెస్ అనిపిస్తుంది అంటూ నటుడు శర్వానంద్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: