సూపర్‌ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. సినిమా రిలీజ్‌ తరువాత విదేశాలకు వెళ్లిపోయిన మహేష్, అక్కడే మరికొంత కాలం ఉండనున్నాడు. అక్కడే మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకొనున్నాడు. తిరిగి వచ్చిన వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన మహర్షి సినిమా ఘన విజయం సాధించటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

 

అయితే ఈ సినిమా తరువాత మహేష్ వరుసగా సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతం ఏడాది ఒక్క సినిమా మాత్రమే చేస్తున్న మహేష్, వచ్చే రెండుళ్లలో నాలుగు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే స్టార్ డైరెక్టర్లు మహేష్ డేట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్సినిమా చేయాల్సి ఉంది. ఆ ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరగా పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడట మహేష్.

 

అంతేకాదు తనకు సరిలేరు నీకెవ్వరు లాంటి సూపర్‌ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయాలని భావిస్తున్నాడు మహేస్. సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్ సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగానే వెల్లడించాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు మహేష్ ప్లాన్‌ చేస్తున్నాడు. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేసిన అతడు, ఖలేజ సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేకపోయినా మహేష్ కెరీర్ కు మాత్రం చాలా ప్లస్‌ అయ్యాయి.

 

త్రివిక్రమ్‌ కూడా అల వైకుంఠపురములో సినిమాతో సూపర్‌ ఫాంలో ఉండటంతో మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. మరో స్టార్‌ డైరెక్టర్‌ కొరటాలతోనూ మహేష్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. శ్రీమంతుడు, భరత్‌ అనే నేను సినిమాలో సూపర్‌ హిట్ అందుకున్న ఈ కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ హిట్ మీద కన్నేసిందన్న టాక్‌ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: